తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2019, 1:17 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్లో పంజాబ్​ జట్టుకు వసీం జాఫర్..!

'కింగ్స్ ఎలెవన్ పంజాబ్'​ బ్యాటింగ్ కోచ్​గా వసీం జాఫర్​ను నియమించినట్లు ఫ్రాంఛైజీ వర్గాల సమాచారం. ఇప్పటికే అతని పేరును అధికారిక వెబ్​సైట్​లో ఉంచింది పంజాబ్.

Wasim Jaffer appointed Kings XI Punjab's batting coach
వసీం జాఫర్

భారత మాజీ క్రికెటర్​ వసీం జాఫర్ మరోసారి ఐపీఎల్లోకి రాబోతున్నాడు. అయితే ఆటగాడిగా కాదు.. కోచ్​గా కనిపించనున్నాడు. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ బ్యాటింగ్​ కోచ్​గా జాఫర్​ను నియమించినట్లు సమాచారం. వచ్చే సీజన్​ నుంచి పంజాబ్​ తరఫున ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని తెలుస్తోంది.

పంజాబ్​ అధికారిక వెబ్​సైట్​లో జట్టు సపోర్ట్ స్టాఫ్​తో పాటు జాఫర్ పేరు ఉండడం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కింగ్స్​ ఎలెవన్ జట్టుకు కుంబ్లే ప్రధాన కోచ్​ కాగా.. బౌలింగ్ కోచ్​గా సునీల్ జోషి, ఫీల్డింగ్ కోచ్​గా​ జాంటీ రోడ్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఐపీఎల్లో 2008 సీజన్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో జాఫర్​ ఆడాడు. ఆరు మ్యాచ్​ల్లో 110.57 స్ట్రైక్​ రేట్​తో 130 పరుగులు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు జాఫర్. 254 దేశవాళీ మ్యాచ్​ల్లో దాదాపు 20 వేల పరుగులు చేశాడు.

టీమిండియా తరఫున 2000 నుంచి 2008 వరకు 31 టెస్టులు ఆడాడు. 1944 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. భారత్​ తరఫున రెండు వన్డేలు ఆడాడు జాఫర్.

ఇదీ చదవండి: సీఏఏపై గంగూలీ కుమార్తె పోస్టు... స్పందించిన దాదా

ABOUT THE AUTHOR

...view details