రాజ్కోట్ వేదికగా సోమవారం ప్రారంభమైన రంజీట్రోఫీ ఫైనల్లో బంగాల్, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది.
బరోట్ (54), విశ్వరాజ్ జడేజా (54) అర్ధసెంచరీలతో రాణించారు. హర్విక్ దేశాయ్ (38) ఫర్వాలేదనిపించాడు. చేతన్ సకారియా (4), షెల్డన్ జాక్సన్ (14) విఫలమయ్యారు. ఫలితంగా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 206 పరుగులు చేసింది.