తెలంగాణ

telangana

ETV Bharat / sports

దాదా.. బంగాల్ సీఎం అవుతాడు: సెహ్వాగ్ - వీరేంద్ర సెహ్వాగ్

సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని తాను ముందే ఊహించానని చెప్పాడు టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్. బంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతాడని స్పష్టం చేశాడు.

దాదా.. బంగాల్ సీఎం అవుతాడు: సెహ్వాగ్

By

Published : Oct 28, 2019, 3:27 PM IST

Updated : Oct 28, 2019, 6:15 PM IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఇటీవలే సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇది తాను ముందే ఊహించానని, దాదా బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని 2007లోనే చెప్పానని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

"2007లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఈ విషయం(గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అంశం) గురించి చెప్పా. అప్పుడు కేప్​టౌన్​ వేదికగా టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్ వసీం జాఫర్ త్వరగా ఔటయ్యాడు. తెందూల్కర్ నాలుగో స్థానంలో దిగుతానని చెప్పాడు. ఆ సమయంలో జట్టుపై ఎంతో ఒత్తిడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్​కు దిగిన గంగూలీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్​లో నా సహచరులతో ఈ విషయం పంచుకున్నా. మనలో బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అవకాశం గంగూలీకే ఉందని వారితో అన్నా. ఇప్పుడు అదే నిజమైంది" - వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ క్రికెటర్

గంగూలీ గురించి రెండు అనుకుంటే ఒకటి నిజమైందని, ఇంకొక్కటి మాత్రమే మిగిలి ఉందని చెప్పాడు సెహ్వాగ్.

"సౌరభ్ బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని చెప్పింది ఇప్పుడు నిజమైంది. అతడు బంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతాడని అప్పుడు చెప్పా. ప్రస్తుతం ఈ ఒక్క అంశమే మిగిలి ఉంది" - వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ క్రికెటర్

అక్టోబరు 23న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈ పదవి చేపట్టిన రెండో రోజే భారత క్రికెట్​కు సంబంధించి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సమావేశమై బంగ్లా సిరీస్​ గురించి చర్చించాడు దాదా.

ఇదీ చదవండి: స్విస్ ఓపెన్​ టైటిల్ పదోసారి గెలిచిన ఫెదరర్​

Last Updated : Oct 28, 2019, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details