టీమిండియా ఆటగాడు కోహ్లీ.. ఆట పట్ల ఎంత పట్టుదలతో ఉంటాడో తన ఫౌండేషన్ పట్ల అంతే నిబద్ధతతో పనిచేస్తాడు. అతడి పేరిట ముంబయిలో ఏర్పాటు చేసిన 'విరాట్ కోహ్లీ ఫౌండేషన్'లో ఎంతో మంది నైపుణ్యం కలిగిన అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి స్కాలర్షిప్లతో పాటు క్రీడాసామాగ్రిని అందిస్తున్నారు. గురువారం అక్కడికి వెళ్లిన కోహ్లీ.. క్రీడాకారులతో సరదాగా గడిపాడు.
"ఈరోజు విరాట్ కోహ్లీ ఫౌండేషన్ అథ్లెట్లను కలవడం ఎంతో ప్రత్యేకం. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావంతోనే మనంక్రీడా దేశంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాం. భారత క్రీడలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. త్వరలో మళ్లీ మిమ్మల్ని కలుస్తా. జైహింద్." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి