తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 4:40 PM IST

Updated : Nov 12, 2019, 4:46 PM IST

ETV Bharat / sports

చిన్నారులతో గల్లీ క్రికెట్ ఆడిన విరాట్​ కోహ్లీ

ఇటీవల బంగ్లాతో టీ20 సిరీస్​కు విశ్రాంతి తీసుకున్న విరాట్​... మళ్లీ మైదానంలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే అదే జట్టుతో తొలి టెస్టు కోసం మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఉంది టీమిండియా. తాజాగా విరాట్​ అక్కడి స్థానిక చిన్నారులతో కలిసి గల్లీ క్రికెట్​ ఆడాడు.

చిన్నారులతో విరాట్ కోహ్లీ​ గల్లీ క్రికెట్

మధ్యప్రదేశ్​లోని ఇండోర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు సిద్ధమవుతోంది టీమిండియా. అయితే జట్టు సారథి విరాట్‌ కోహ్లీ మాత్రం స్థానిక చిన్నారులతో కలిసి సరదాగా గడిపాడు. ఓ ప్రకటన కోసం షూటింగ్​లో భాగంగా పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు ఈ స్టార్​ బ్యాట్స్​మన్​.బ్యాటింగ్​ చేయడమే కాకుండా వాళ్లకు బౌలింగ్​ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సారథికి బదులుగా తాత్కాలిక కెప్టెన్​గా రోహిత్​ బాధ్యతలు చేపట్టాడు. అయితే గురువారం నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌కు.. విరాట్​ సారథ్యంలో బరిలోకి దిగనుంది టీమిండియా.

రెండో టెస్టు నవంబర్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈడెన్‌ గార్డెన్‌లో జరగనున్న ఈ మ్యాచ్​ను తొలిసారి డే/నైట్‌ రూపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది బీసీసీఐ.

Last Updated : Nov 12, 2019, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details