తెలంగాణ

telangana

జిమ్​లో టీమిండియా క్రికెటర్ల కసరత్తులు

By

Published : Sep 21, 2019, 1:43 PM IST

Updated : Oct 1, 2019, 11:09 AM IST

దక్షిణాఫ్రికాతో జరగబోయే చివరి టీ20కి ముందు జిమ్​లో చెమటలు చిందించారు టీమిండియా ఆటగాళ్లు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు క్రికెటర్ ధావన్.

కోహ్లీ

దక్షిణాఫ్రికాతోఆదివారం జరిగే చివరి టీ20 కోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న క్రికెటర్లు.. జిమ్​లో చెమటలు చిందిస్తున్నారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు ధావన్.

కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, నవదీప్ సైనీ, శ్రేయస్ అయ్యర్​.. జిమ్​లో కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ నేషనల్ క్రికెట్​ అకాడమీలో ప్రాక్టీస్​లో ఉన్నారు.

ద్రవిడ్​తో కోహ్లీ

బెంగళూరు నేషనల్ అకాడమీలో దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్​ను కలిశాడు సారథి కోహ్లీ. అతడితో కరచాలనం చేస్తోన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

టీ20 సిరీస్​ అనంతరం టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. వచ్చే నెల 2న భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది.

ఇవీ చూడండి.. రోహిత్ సరదా వీడియో.. ధావన్​ కామెంట్​

Last Updated : Oct 1, 2019, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details