తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​తో ఆ మ్యాచ్​ కోహ్లీ కెరీర్​లోనే 'గేమ్​ ఛేంజర్​' - 2012 ఆసియా కప్​

2012 ఆసియాకప్​ పాకిస్థాన్​తో లీగ్​ మ్యాచ్​ తనకు తీపి జ్ఞాపకమని చెప్పాడు కోహ్లీ. ఆ రోజు అద్భుతంగా ఆడిన​ తర్వాత ప్రపంచంలో ఏ బౌలింగ్​ను అయినా ఆడగలననే నమ్మకమొచ్చిందని అన్నాడు.

Virat Kohli reveals the knock against Pakistan that was 'game-changer' for his career
ఆ మ్యాచ్​లో 'గేమ్​ ఛేంజర్​'గా విరాట్​ కోహ్లీ

By

Published : May 31, 2020, 11:53 AM IST

ఢాకా వేదికగా, 2012లో జరిగిన ఆసియాకప్​లో భారత్​-పాకిస్థాన్​ లీగ్​ మ్యాచ్.. తన కెరీర్​లో గేమ్ ఛేంజర్ అని చెప్పాడు ప్రస్తుత టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.​ ఈ పోరులో​ అనేక రికార్డులు నమోదయ్యాయి. విరాట్ 183 పరుగులు చేసి, తన వన్డే కెరీర్​లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం కాకుండా, పాక్​పై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఘనత దక్కించుకున్నాడు. ఇటీవలే స్పిన్నర్​​ అశ్విన్​తో ఇన్​స్టా​ లైవ్​​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు విరాట్. ఆ మ్యాచ్​ తీపి జ్ఞాపకంగా తనకెప్పుడు గుర్తుండిపోతుందని తెలిపాడు.

విరాట్​ కోహ్లీ

"పాక్ బౌలింగ్​ దాడి చాలా శక్తిమంతమైనది. ఆ మ్యాచ్​లో బంతులను ఎదుర్కోవడం సవాలుగా మారింది. అఫ్రిది, సయీద్​ అజ్మల్​, ఉమర్​ గుల్​, అజీజ్​ చీమా, హఫీజ్​లకు మొదటి 20 నుంచి 25 ఓవర్ల వరకు పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు సచిన్​ చాలా సంతోషంగా బ్యాటింగ్​ చేస్తున్నాడు. ఎందుకంటే అదే అతడి చివరి వన్డే. మాస్టర్​ హాఫ్​ సెంచరీ చేయడం వల్ల 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాం. అది నాకు ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది"

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

విరాట్​ కోహ్లీ, సచిన్​ తెందుల్కర్​

ఈ ఇన్నింగ్స్​లో చేసిన బ్యాటింగ్ వల్ల ఆ తర్వాత ప్రపంచంలో ఏ బౌలింగ్​లోనైనా ఆడగల విశ్వాసం వచ్చిందని కోహ్లీ వెల్లడించాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన పాక్​.. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 47.5 ఓవర్లలోనే టీమ్​ఇండియా చేధించింది.

ఇదీ చూడండి...'ధోనీని కొనసాగించాలి.. ఐపీఎల్ కచ్చితంగా జరపాలి'

ABOUT THE AUTHOR

...view details