తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకేసారి రెండు ఘనతలు అందుకున్న కోహ్లీ - kohli centuries

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్​లో 7వ ద్విశతకం చేసి, 7000 పరుగుల మార్క్​ను అందుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

By

Published : Oct 11, 2019, 2:45 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఈ ఫార్మాట్​లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అదే విధంగా టెస్టుల్లో తన ఏడో డబుల్​ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో బ్రాడ్​మన్​(6996) పరుగుల రికార్డును అధిగమించాడు భారత సారథి.

పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో భారత్.. భారీస్కోరు దిశగా సాగుతోంది. క్రీజులో విరాట్​తో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు. వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లు శ్రమిస్తున్నారు. ఈ సిరీస్​లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన.

ఇది చదవండి: దిగ్గజాల సరసన కోహ్లీ... నాలుగో స్థానం కైవసం

ABOUT THE AUTHOR

...view details