తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ పోలీసులకు కెప్టెన్ కోహ్లీ సెల్యూట్​ - దిల్లీ పోలీసుల సేవలు ప్రశంసించిన విరాట్​ కోహ్లీ, ఇషాంత్​ శర్మ

లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న దిల్లీ పోలీసులపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడాడు.

Virat Kohli, Ishant Sharma laud Delhi Police for their services amid Covid-19 lockdown
'దిల్లీ పోలీసుల సేవలు ప్రశంసనీయం'

By

Published : Apr 11, 2020, 12:12 PM IST

Updated : Apr 11, 2020, 12:20 PM IST

కరోనా​ కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను ప్రశంసించాడు టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలకు వారు చేస్తున్న పనిని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా దిల్లీ పోలీసులు రాత్రింబవళ్లు చేస్తున్న సేవలకుగాను అభినందించాడు.

"క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవలు అందిస్తున్న దేశ పోలీసులకు నా అభినందనలు. లాక్​డౌన్​ కారణంగా జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తోన్న పేదలకు ఆహారం అందిస్తూ, నిజాయతీగా విధులు నిర్వహిస్తున్న దిల్లీ పోలీసుల సేవలు ప్రశంసనీయం. ఇలానే మీ సేవలను కొనసాగించండి"

-విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

పోలీసులకు సహకరించండి

టీమిండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ.. దిల్లీ పోలీసుల సేవలను కొనియాడాడు. ఇంటి వద్దే ఉంటూ ప్రజలు, అధికారులకు సహకరించాలని కోరాడు. వైరస్​పై వస్తున్న వదంతులు నమ్మొదన్నాడు. అందరం కలిసికట్టుగా ఈ మహ్మమారిని ఎదుర్కోవాలని సూచించాడు.

భారత్‌లో శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 వేలకుపైగా చేరింది. ఒక్క దిల్లీలోనే 900కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం.. మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనల్ని తీసుకొచ్చింది.

ఇదీ చూడండి : సిగ్నల్​ కోసం చెట్లు ఎక్కుతున్న ప్రముఖ అంపైర్

Last Updated : Apr 11, 2020, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details