తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ-రోహిత్​తో దోబూచులాడుతున్న​ రికార్డు - Virat Kohli has scored most runs in T20Is followed by Rohit Sharma in NZvIND 3rd T20I

విరాట్​ కోహ్లీ, రోహిత్​శర్మ భారత జట్టు స్టార్​ బ్యాట్స్​మన్​లు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ప్రపంచ క్రికెట్​లోనే అత్యత్తమ ఆటగాళ్లు. అంతేకాకుండా టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ మ్యాచ్​లో బరిలోకి దిగితే ఏదో ఒక రికార్డు బ్రేక్​ చేస్తూనే ఉంటారు. అయితే ఓ రికార్డు మాత్రం గతేడాది నుంచి వీరిద్దరి మధ్య దోబూచులాడుతూనే ఉంది.

virat kohli, rohit sharma
కోహ్లీ-రోహిత్​ మధ్య ఈ రికార్డు దోబూచులాట

By

Published : Jan 30, 2020, 7:19 PM IST

Updated : Feb 28, 2020, 1:46 PM IST

భారత క్రికెట్​లో రోహిత్​, కోహ్లీకి రికార్డులంటే లెక్కేలేదు. అలవోకగా రన్స్​ చేస్తూ మ్యాచ్​ స్వరూపాలను మార్చేస్తుంటారు. అయితే వీరిద్దరి మధ్య గతేడాది నుంచి ఓ రికార్డు దోబూచులాడుతోంది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక పరుగులు వీరుడి స్థానం కోసం వీళ్లిద్దరూ పోటీపడుతూనే ఉన్నారు. గతేడాది టెస్టుల్లోనూ సమానమైన పరుగులు చేసిన వీళ్లు.. తాజాగా ఈ రికార్డు వేటలోనూ రేసులో ఉన్నారు. ప్రస్తుతం విరాట్​ కోహ్లీ 2783 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్​ శర్మ 2713 రన్స్​తో రెండో ర్యాంక్​లో ఉన్నాడు. న్యూజిలాండ్​ పర్యటనలో మరో రెండు టీ20లు బాకీ ఉన్నాయి. వీటిలో హిట్​మ్యాన్​ ఫామ్​ నిరూపిస్తే ఈ రికార్డు మళ్లీ మారే అవకాశముంది.

విరాట్​ కోహ్లీ, రోహిత్​శర్మ

మహీని దాటేశాడు..

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీని ఇటీవలే అధిగమించాడు ప్రస్తుత కెప్టెన్​ విరాట్‌ కోహ్లీ. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సారథిగా విరాట్‌ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా... కింగ్​ కోహ్లీ మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్​లో ఇష్‌ సోథి వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ నాలుగో బంతిని సింగిల్‌ సాధించి ఈ మైలురాయి అందుకున్నాడు విరాట్​. ఈ క్రమంలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ(1112) రికార్డు బ్రేక్​ అయింది. మొత్తంగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా సారథి డూప్లెసిస్‌(1273), కివీస్‌ కెప్టెన్​ కేన్‌ విలియమ్సన్‌(1148) రన్స్​తో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

పదివేల క్లబ్​లో హిట్​మ్యాన్​..

ఇదే మ్యాచ్‌లో టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 23 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. ఇది రోహిత్‌కు కెరీర్​లో 24వది. ఈ ప్రదర్శనతో టీ20ల్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన ఆటగాడిగా సారథి విరాట్‌ కోహ్లీ సరసన చేరాడు హిట్​మ్యాన్​.

అంతేకాకుండా పదివేల పరుగుల క్లబ్‌లోనూ చేరాడు రోహిత్​. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మట్లలో కలిపి పది వేల పరుగులు సాధించిన నాలుగో టీమిండియా ఓపెనర్‌గా ఘనత సాధించాడు. భారత మాజీ ఆటగాళ్లు సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత ఈ ఫీట్​ ఖాతాలో వేసుకున్నాడు హిట్​మ్యాన్​.

Last Updated : Feb 28, 2020, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details