తెలంగాణ

telangana

ETV Bharat / sports

న్యూజిలాండ్​లోనూ కోహ్లీ కోసం ఆగట్లేదు! - భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ20

భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ20 జరుగుతుండగా, కోహ్లీని కలిసేందుకు ఇద్దరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. విరాట్​ కోసం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఇలాంటి సంఘటన జరగడం విశేషం.

న్యూజిలాండ్​లోనూ కోహ్లీ కోసం ఆగట్లేదు!
విరాట్ కోహ్లీ

By

Published : Feb 2, 2020, 10:01 AM IST

Updated : Feb 28, 2020, 8:50 PM IST

తమ ఆరాధ్య క్రికెటర్లను కలుసుకోవాలని, ఒక్కసారైనా ముట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు కొందరు వీరాభిమానులు. ఈ క్రమంలోనే మ్యాచ్​ జరుగుతున్నప్పుడు బారికేడ్లు దాటి, మైదానంలోకి ప్రవేశిస్తుంటారు. భారత్-న్యూజిలాండ్​ నాలుగో టీ20 సందర్భంగా ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. కోహ్లీని కలిసేందుకు ఇద్దరు అభిమానులు(వేరువేరుగా) మైదానంలోకి వెళ్లారు. వారిని పట్టుకునేందుకు మైదాన సిబ్బంది ఆపసోపాలు పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

సూపర్​ ఓవర్​కు దారితీసిన ఈ మ్యాచ్​లో భారత్ అద్భుత విజయం సాధించింది. సిరీస్​లో 4-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టీ20.. బే ఓవల్​ మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. ఇందులోనూ గెలిచి కివీస్​ను వైట్​వాష్ చేయాలని భారత్​ చూస్తుండగా, పరువు నిలుపుకోవాలని భావిస్తోంది ఆతిథ్య న్యూజిలాండ్.

Last Updated : Feb 28, 2020, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details