తెలంగాణ

telangana

ETV Bharat / sports

గోల్డెన్ డకౌట్​తో విండీస్​ టూర్​ను ముగించిన కోహ్లీ - west indies

వెస్టిండీస్​తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమిండియా సారథి కోహ్లీ గోల్డెన్ డకౌట్​గా వెనుదిరిగాడు. ఫలితంగా డకౌట్​తో విండీస్ టూర్​ను ముగించాడు.

కోహ్లీ

By

Published : Sep 2, 2019, 9:02 AM IST

Updated : Sep 29, 2019, 3:37 AM IST

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో చివరి టెస్టు ఆడుతోంది టీమిండియా. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 416 పరుగులు చేసిన కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్​లో 168 పరుగులకు డిక్లేర్ చేసింది. కోహ్లీ డకౌట్​గా వెనుదిరిగి సిరీస్​ను ముగించాడు.

రెండో ఇన్నింగ్స్​లో కోహ్లీ గోల్డెన్ డకౌట్​గా వెనుదిరిగాడు. ఫలితంగా డకౌట్​తో విండీస్ టూర్​ను ముగించాడు. టెస్టు కెరీర్​లో ఈ ఆటగాడికిది నాలుగో గోల్డెన్ డక్. కీమర్ రోచ్​ వేసిన బంతికి పెవిలియన్ చేరాడు. చివరగా 2018లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు.

బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ పరిమిత ఓవర్లలో తొమ్మిదిసార్లు డకౌట్​గా వెనుదిరిగాడు.

వెస్టిండీస్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో నాలుగు ఇన్నింగ్స్​ల్లో 34 సగటుతో 136 పరుగులు చేశాడు కోహ్లీ. ఈ సిరీస్​లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

ఇవీ చూడండి.. టీట్వంటీల్లో మలింగ సరికొత్త రికార్డు..

Last Updated : Sep 29, 2019, 3:37 AM IST

ABOUT THE AUTHOR

...view details