తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 6:05 PM IST

Updated : Nov 12, 2019, 6:28 PM IST

ETV Bharat / sports

ఎరుపు బంతి స్థానంలో గులాబి బంతి.. ప్రాక్టీస్ షురూ

తొలిసారి భారత జట్టు నవంబర్​ 22 నుంచి 26 వరకు డే/నైట్​ మ్యాచ్​ ఆడనుంది. ఇందుకోసం మొదటి టెస్టు వేదికైన ఇండోర్​లోనే ప్రాక్టీసుకు మధ్యప్రదేశ్​ క్రికెట్​ అసోసియేషన్​(ఎంపీసీఏ) అనుమతి తీసుకుంది టీమిండియా. అయితే నేటి నుంచే సాధారణ ఎరుపు బంతితో కాకుండా గులాబి బంతితో ప్రాక్టీస్​ మొదలుపెట్టేసింది కోహ్లీసేన.

ఫ్లడ్‌లైట్ల కింద గులాబి బంతితో.. విరాట్​సేన ప్రాక్టీస్‌

భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈనెల 22 నుంచి 26 వరకు తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తొలిసారి పింక్​ బాల్​ మ్యాచ్‌ ఆడనుంది కోహ్లీసేన. అయితే ఫ్లడ్​లైట్ల వెలుగులో మ్యాచ్​ ఆడాల్సి ఉంటుంది కాబట్టి వాతావరణానికి అలవాటు పడటానికి మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంపీసీఏ) సాయం కోరింది టీమిండియా. ఇండోర్‌ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల కింద ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేయడానికి సహకరించాలని యాజమాన్యం అడగ్గా.. అందుకు మద్దతు తెలిపింది ఎంపీసీఏ.

" టీమిండియా గులాబి బంతితో ప్రాక్టీస్‌ చేయడానికి మమ్మల్ని సంప్రదించింది. అందుకు మేం సంతోషంగా ఒప్పుకున్నాం. వారికి తగిన ఏర్పాట్లు చేశాం".
- మిలింద్​ కన్మాడికర్​, ఎంపీసీఏ మాజీ సెక్రటరి

ఇదే విషయంపై టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌ అజింక్య రహానె మాట్లాడుతూ.. " ఇదొక కొత్త ఛాలెంజ్‌. ఈ మ్యాచ్‌ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇదెలా జరుగుతుందో నాకు తెలీదు. కొన్ని సెషన్లు ప్రాక్టీస్‌ చేస్తే కొంత అవగాహన వస్తుంది. అప్పుడే పింక్‌బాల్‌ ఆటపై ఒక అంచనాకు రాగలుగుతాం. కొత్త పద్ధతిని అలవాటు చేసుకోవడం ఇబ్బందిగా భావించకూడదు " అని తెలిపాడు.

నేడు విభిన్నంగా...

ప్రతిష్టాత్మక డే/నైట్​ టెస్టుకు సమయం దగ్గరపడటం వల్ల నేడే గులాబి బంతితో ప్రాక్టీస్​ ప్రారంభించింది కోహ్లీసేన. అయితే రాత్రి వరకు ఆగకుండా ఉదయం సెషన్​ నుంచే ఈ బంతితో సాధన చేసింది. ఎరుపు రంగు బంతులతో ఆడే ప్రాంతంలోనే పింక్​బాల్​ను ప్రయత్నించారు.

సాధారణ నెట్స్​లో గులాబి బంతితో విరాట్​ ప్రాక్టీస్​

మొదట విరాట్​ తర్వాత పుజారా బ్యాటింగ్​ చేయగా.. త్రో స్పెషలిస్ట్​ రాఘవేంద్ర, బౌలర్​ నువాన్​ సేనవిరత్నే ఆటగాళ్లకు బంతులు వేశారు. తొలి టెస్టు తర్వాత టాప్​ ఆటగాళ్లు​ అజింక్యా రహానే, మయాంక్​ అగర్వాల్​, పుజారా, షమీ.. ఎన్​సీఏ ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ పర్యవేక్షణలో తర్ఫీదు పొందనున్నారు.

Last Updated : Nov 12, 2019, 6:28 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details