తెలంగాణ

telangana

ETV Bharat / sports

పెళ్లిరోజూ క్రికెట్​పైనే ఆ జంట ధ్యాసంతా..! - CoupleGoals by icc

కాన్​బెర్రా వేదికగా పాకిస్థాన్​-ఆస్ట్రేలియా మధ్య మంగళవారం రెండో టీ20 మ్యాచ్​ జరిగింది. అమెరికాలో పెళ్లి చేసుకున్న ఓ జంట... వివాహం తర్వాత మ్యాచ్​ చూస్తూ కనిపించారు. ఈ ఫొటోలను ఐసీసీ ట్విట్టర్లో షేర్​ చేసింది.

పెళ్లిరోజు కూడా క్రికెట్​పైనే ఆ జంట ధ్యాసంతా..!

By

Published : Nov 6, 2019, 8:55 PM IST

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్​కు ఉన్న ఆదరణే వేరు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మైదానంలోనూ, ఇంట్లోనూ ఈ ఆటను చూస్తూ ఆస్వాదిస్తుంటారు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​లోనూ 80 ఏళ్ల బామ్మ... ప్రత్యక్షంగా క్రికెట్​ను చూడటమే కాకుండా కోహ్లీ, రోహిత్​లను కలిసింది. తనకు ఆటపై ఉన్న మక్కువను వెల్లడించింది. ఎంతో ప్రజాదరణ కలిగిన క్రికెట్​ కోసం, ఇటీవలే ఓ జంట తమ జీవితంలోని మధుర క్షణాలనూ లెక్కచేయలేదు.

పాకిస్థాన్​ క్రికెట్ జట్టుకు​ వీరాభిమాని అయిన హసన్​ తస్లీమ్​​... అమెరికాలోని మిచిగాన్​లో ఉంటుంది. మంగళవారం వివాహం చేసుకుంది. అదే రోజు పాక్​-ఆసీస్ మధ్య రెండో టీ20 జరిగింది. క్రికెట్​ను అమితంగా ఇష్టపడే ఈమె... పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి లైవ్​ మ్యాచ్​ వీక్షించింది. టీవీలో చూస్తూ ఎంజాయ్​ చేసింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె నెట్టింట షేర్​ చేయగా... ఐసీసీ వాటిని పోస్టు చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్​గా మారాయి.

ఈ మ్యాచ్​లో ఆసీస్​​ ఓపెనర్​ స్టీవ్ స్మిత్ (80*; 51 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సర్​) అదరగొట్టడం వల్ల పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో కంగారూలు విజయం సాధించారు. మూడు మ్యాచ్​ల సిరీస్‌లో.. తొలి మ్యాచ్​ వర్షార్పణం కాగా... రెండో టీ20 గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది ఆస్ట్రేలియా. పెర్త్‌ వేదికగా శుక్రవారం ఆఖరి పోరు జరగనుంది. ఈ ద్వైపాక్షిక టీ20 సిరీస్​ తర్వాత రెండు మ్యాచ్​లటెస్టు సిరీస్​ ఆడనున్నాయి ఇరుజట్లు.

ABOUT THE AUTHOR

...view details