తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: ప్రపంచకప్​ గెలిస్తే భారీ జాక్​పాట్

త్వరలో జరిగే ప్రపంచకప్​లో గెలిచిన జట్టుకు భారీస్థాయిలో నజరానా ఇస్తున్నట్లు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈ మెగాటోర్నీ​ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 70 కోట్లు). ఇందులో విజేతకు సూమారు 4 మిలియన్​ డాలర్లు (రూ. 28 కోట్లు) దక్కనున్నాయి.

By

Published : May 17, 2019, 3:34 PM IST

ప్రపంచకప్​లో గెలిచిన జట్టు సూమారు 28 కోట్ల రూపాయలు దక్కించుకోనున్నాయి

మే 30న ప్రారంభం కానుంది వన్డే క్రికెట్ ప్రపంచకప్​. గెలిచేందుకు జట్లన్నీ ప్రణాళికల రచిస్తున్నాయి. విజేతగా నిలిచిన టీమ్​ భారీ స్థాయిలో నజరానా అందుకోనుంది. సుమారు 4 మిలియన్ డాలర్లు(రూ.28 కోట్లు) దక్కించుకోనుంది. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్​ టోర్నీల్లో ఇదే అత్యధిక మొత్తం కావడం విశేషం.

ఇంగ్లాండ్ ​& వేల్స్ వేదికగా రౌండ్​ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా వాటితో తలపడనుంది. జులై 16న ప్రఖ్యాత లార్డ్స్ మైదానం​లో ఫైనల్ పోరు జరగనుంది​.

నజరానా వివరాలు:

  1. విజేత- 4 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.28 కోట్లు)
  2. రన్నరప్- 2 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.14 కోట్లు)
  3. సెమీ ఫైనల్​లో ఓడిన జట్లకు: తలో 8 లక్షల యూఎస్ డాలర్లు(రూ.5.61 కోట్లు)
  4. లీగ్​ దశ దాటిన జట్లకు: తలో లక్ష యూఎస్ డాలర్లు(రూ.70 లక్షలు)
  5. లీగ్​ దశలో గెలిచిన జట్టుకు ఒక్కో మ్యాచ్​కు 40 వేల యూఎస్ డాలర్లు(రూ. 28 లక్షలు)

ABOUT THE AUTHOR

...view details