దాదాపు ఏడాది తర్వాత మహిళల క్రికెట్ జట్టు మైదానంలో దిగబోతోంది. సౌతాఫ్రికాతో మార్చి 7 నుంచి స్వదేశంలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్(వన్డే, టీ-20)లో ఆడనుంది. ఈ విషయమై బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) ధ్రువీకరించింది.
భారత మహిళా క్రికెట్ మళ్లీ షురూ- సౌతాఫ్రికాతో సిరీస్! - మార్చి 7 నుంచి భారత్-సౌతాఫ్రికా సిరీస్
కరోనా అనంతరం వచ్చే నెల 7న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది భారత మహిళల జట్టు. వన్డే, టీ-20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్కు రానుంది. ఈ విషయాన్ని ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
![భారత మహిళా క్రికెట్ మళ్లీ షురూ- సౌతాఫ్రికాతో సిరీస్! UPCA confirms India-South Africa series in Lucknow from March 7](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10751336-thumbnail-3x2-mvj.jpg)
మార్చి 7 నుంచి భారత్-సౌతాఫ్రికా సిరీస్
ఫిబ్రవరి 25 నాటికి ఇరు జట్లు లఖ్నవూ చేరుకుంటాయని యూపీసీఏ పేర్కొంది. సౌతాఫ్రికాతో 5 వన్డేలతో పాటు 3 టీ20లు ఆడనుంది భారత్. తొలి వన్డేకు ముందు ఆరు రోజుల పాటు ప్లేయర్లు క్వారంటైన్లో ఉండనున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో యూసుఫ్ పఠాన్ క్రికెట్ అకాడమీ