పాకిస్థాన్కు చెందిన అంపైర్ అలీమ్ దార్, ప్రపంచరికార్డు సృష్టించనున్నారు. రావల్పిండి వేదికగా ఆదివారం జరగనున్న పాక్-జింబాబ్వే మ్యాచ్తో అత్యధిక వన్డేలకు అంపైరింగ్ చేసిన వ్యక్తిగా ఘనత సాధిస్తారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్ట్జెన్ను అధిగమిస్తారు. అలీమ్ దార్కు ఇది 210వ వన్డే.
ఆల్ రౌండర్గా కెరీర్ ప్రారంభించి
పాకిస్థాన్ జట్టులో ఆల్రౌండర్గా 10 సంవత్సరాలు సేవలందించారు అలీమ్ దార్. 2000లో పాకిస్థాన్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్తో మొదటిసారి అంపైర్గా విధులు నిర్వర్తించారు. ఇప్పటివరకు 132 టెస్టులు, 46 టీ20లు, 209 వన్డేలకు ఈయన పనిచేశారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 387 మ్యాచ్లకు అంపైరింగ్ చేశారు.