తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్​-19 వరల్డ్​కప్​: టాస్​ గెలిచిన శ్రీలంక.. మొదట భారత్​ బ్యాటింగ్​

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్​-19 ప్రపంచకప్​లో భారత్​-శ్రీలంక మధ్య పోరు మొదలైంది. టాస్​ గెలిచిన లంక జట్టు తొలుత భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. ప్రియమ్​ గార్గ్​ నేతృత్వంలోని యువ టీమిండియా ఈ మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​గా, ఫేవరెట్​గా బరిలోకి దిగింది.

By

Published : Jan 19, 2020, 1:36 PM IST

U19 Worldcup
అండర్​-19 వరల్డ్​కప్​

దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటీన్‌ వేదికగా కుర్రాళ్ల ప్రపంచకప్‌లో భారత్‌.. తన పోరు మొదలుపెట్టింది. ఇవాళ శ్రీలంకతో టైటిల్‌ వేటను ఆరంభించింది. టాస్​ గెలిచిన లంక జట్టు.. బౌలింగ్​ ఎంచుకుంది. ఇప్పటికేగత నాలుగు ప్రపంచకప్పుల్లో రెండు టైటిళ్లు నెగ్గడం, ఓసారి రన్నరప్‌గా నిలవడం ద్వారా ఈ మ్యాచ్​లోనూ ఫేవరెట్​గా బరిలోకి దిగింది 'మెన్​ ఇన్​ బ్లూ'.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఆశలకు యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కీలకం కానున్నాడు. కెప్టెన్‌ ప్రియమ్‌గార్గ్‌ జట్టులో అందరికన్నా అనుభవజ్ఞుడు. తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ జట్టులో ఉన్నాడు.

భారత యువ జట్టు...

ప్రియమ్ గార్గ్ (కెప్టెన్​), ధృవ్​చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, సిద్దేశ్​ వీర్​, శుభంగ్ హెగ్డే, సుశాంత్ మిశ్రా,రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి

శ్రీలంక జట్టు...

కమల్​ మిషారా(కెప్టెన్​), నవోద్​ పరణవితన, రవిండు రసంత, తవీష, నిపున్(కెప్టెన్​), సోనాల్​ దినుషా, కవిండు నదీషన్​, ఆషియన్​ డేనియల్​, అంశీ డిసిల్వా, దిల్షాన్​,​ మదుశంక,మతీష పతిరణ

ABOUT THE AUTHOR

...view details