తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమిండియాను ఓడించేందుకు బంగ్లాకు ఇదే అవకాశం' - laxman about Bangladesh team

భారత గడ్డపై టీ20 సిరీస్​ను గెలవడానికి బంగ్లాదేశ్​కు ఇదే సరైన సమయమని అన్నాడు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. భారత జట్టు మిడిలార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తుందని తెలిపాడు.

లక్ష్మణ్

By

Published : Oct 31, 2019, 4:59 PM IST

Updated : Oct 31, 2019, 8:56 PM IST

షకిబుల్ హసన్​పై ఐసీసీ నిషేధం విధించింది. తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా టీమిండియాతో సిరీస్​కు దూరమయ్యాడు. ఇద్దరు సీనియర్​ ఆటగాళ్లు లేకుండానే భారత్​ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది బంగ్లా జట్టు. అయితే టీమిండియాపై టీ20 సిరీస్​ గెలవడానికి ఇదే మంచి తరుణమని అంటున్నాడు భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్.

"భారత గడ్డపై టీమిండియాను ఓడించేందుకు బంగ్లాదేశ్​ జట్టుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే వారి బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. పేస్ బౌలింగ్​లో ముస్తఫిజుర్ రెహ్మన్​పై ఎక్కువ ఒత్తిడి పడనుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ముస్తఫిజుర్ టాపార్డర్ వికెట్లు తీసి భారత జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. మిడిలార్డర్​లో టీమిండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది."
-వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ ఆటగాడు

కోహ్లీ గైర్హాజరుతో అందివచ్చిన అవకాశాన్ని యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు లక్ష్మణ్.

"భారత పిచ్​లు స్పిన్​కు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల చాహల్, వాషింగ్టన్ సుందర్ ఈ పిచ్​లపై కీ రోల్ పోషించనున్నారు. కృనాల్ పాండ్య లాంటి యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం."
-వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ ఆటగాడు

రోహిత్, రాహుల్​, ధావన్​లు టాపార్డర్​లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు లక్ష్మణ్. అలాగే సిరీస్​ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంటుందని తెలిపాడు.

ఇవీ చూడండి.. ద్రవిడ్​ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం

Last Updated : Oct 31, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details