తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​ కంటే దేశవాళీ మ్యాచ్​లు బెటర్​' - BCCI news

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే క్రీడా కార్యక్రమాలు ప్రారంభమౌతున్న తరుణంలో దేశవాళీ క్రికెట్​పై దృష్టి సారించాలని టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్​ కంటే ద్వైపాక్షిక సిరీస్​లు లేదా దేశవాళీ మ్యాచ్​ల నిర్వహణ మేలని సూచించాడు.

This is The Great opportunity for every country to focus on domestic cricket: Ravi Shastri
'ప్రపంచకప్​ కంటే దేశవాళీ సిరీస్​లు బెటర్​'

By

Published : May 15, 2020, 4:00 PM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు నిలివేశారు. దాదాపుగా రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే టోర్నీల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. జర్మనీలో శనివారం నుంచి ఫుట్​బాల్​ మ్యాచ్​లు ప్రారంభం అవ్వబోతున్నాయి. క్రికెటర్లను ఐసోలేషన్​లో ఉంచి టోర్నీలు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయిస్తోంది.

ఇలాంటి సమయంలో అంతర్జాతీయ మ్యాచ్​ల కంటే దేశవాళీ టోర్నీలపై దృష్టి సారించాలని టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి సూచించాడు. క్రికెటర్లంతా మైదానంలోకి వచ్చి దేశవాళీ క్రికెట్​కు పూర్వవైభవం తీసుకురావాలని కోరాడు.

ప్రపంచకప్​ కంటే అదే బెటర్​

ప్రపంచకప్​ లేదా ద్వైపాక్షిక సిరీస్​ అనే అంశాన్ని ఎంచుకోవాల్సి వస్తే తాను కచ్చితంగా ద్వైపాక్షిక పర్యటనల వైపే మొగ్గు చూపుతానని రవిశాస్త్రి అన్నాడు. ఎందుకంటే 15 జట్లు కలిసే కంటే రెండు టీమ్​లతో సిరీస్​ను ఆడటం మేలని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్​ కంటే దేశవాళీ, ద్వైపాక్షిక సిరీస్​లు నిర్వహించడం వల్ల తక్కువ రిస్క్​ ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి.. ఐపీఎల్​ జరిగితే జీతాల్లో కోతలు ఉండవు: గంగూలీ

ABOUT THE AUTHOR

...view details