తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఈరోజే

ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పొట్టి ఫార్మాట్(టీ20) మ్యాచ్​​ మొట్టమొదటి సారిగా ఎక్కడ జరిగిందో తెలుసా? ఆ మ్యాచ్​లో ఏ జట్టు గెలుపొందిందో తెలుసుకోవాలని ఉందా.. అయితే చదివేయండి మరి.

By

Published : Feb 17, 2021, 7:11 PM IST

This Day That Year: First men's T20I was played in 2005
2005 ఫిబ్రవరి 17న ఏం జరిగిందంటే?

మొదట్లో క్రికెట్ అంటే కేవలం టెస్టులు, వన్డేలు. ఈ రెండు ఫార్మాట్లే ఉండేవి. టీ20 ఫార్మాట్​ ఆ తర్వాత వచ్చింది. అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఈ పొట్టి ఫార్మాట్ ఎప్పుడు, ఎక్కడ పుట్టింది.​ తొలి మ్యాచ్​ ఎవరి మధ్య జరిగింది? అందులో విజేత ఎవరు? అనే ఆసక్తికర అంశాలు మీ కోసం.

2005 ఫిబ్రవరి 17న టీ20 మ్యాచ్​ తొలిసారిగా ఆక్లాండ్​ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్​లో ఆసీస్​ జట్టు గెలుపొందింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214/5 పరుగులు చేసింది. కెప్టెన్​ రికీ పాంటింగ్ 55 బంతుల్లోనే 8 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 98 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్ టీమ్​ ఛేదనలో చతికిలపడింది. 170 పరుగులకే ఆలౌటైంది. మైకేల్​ కాస్ప్రోవిచ్​ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాంటింగ్​ మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

కాగా ఇప్పటివరకు ఆరు టీ20 వరల్డ్​ కప్​లు జరిగాయి. వాటిలో వెస్టిండీస్​ జట్టు అత్యధికంగా రెండు సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్​కు భారత్​ ఆతిథ్యమివ్వనుంది.

ఇదీ చదవండి:'ఆర్సీబీ.. మాక్స్​వెల్​ను దక్కించుకోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details