తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అతడి ప్రతిభకు దరిదాపుల్లో ఎవరూ లేరు'

హార్దిక్ పాండ్యలా రాణించే ఆటగాడు ప్రస్తుత భారత జట్టులో ఎవరూ లేరని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

By

Published : May 15, 2019, 2:48 PM IST

హార్దిక్ పాండ్య ప్రతిభపై సెహ్వాగ్ ప్రశంసలు

టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యపై దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ప్రతిభ అతడికి ఉందని, భారత జట్టులో పాండ్య లాంటి క్రికెటర్​ దరిదాపుల్లో లేడని చెప్పాడు. ఇటీవల కాలంలో ఆడిన మ్యాచ్​లే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నాడు.

"హార్దిక్ ప్రతిభకు సరితూగే క్రికెటర్ ప్రస్తుతం టీమిండియాలో లేడు. ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని భారత జట్టులోకి తీసుకుంటుంది బీసీసీఐ." -వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ క్రికెటర్

12వ ఐపీఎల్​ సీజన్​లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించడంలో హార్దిక్ ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటు, బంతితో రాణించి ఆకట్టుకున్నాడు. మొత్తం 15 మ్యాచ్​ల్లో 191.42 సగటుతో 402 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 91.

హార్దిక్ పాండ్య

ఇంగ్లండ్​లో త్వరలో ప్రారంభం కానుంది వన్డే ప్రపంచకప్​. అందులో పాల్గొనే భారత జట్టులో పాండ్య ఒకడు. ఆ మెగాటోర్నీలో తనదైన ఆటతో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడీ క్రికెటర్.

ఇది చదవండి: 'మా విజయాలకు ఆ ముగ్గురి సలహాలే కీలకం' అంటున్న యజ్వేంద్ర చాహల్

ABOUT THE AUTHOR

...view details