మొతెరా వేదికగా రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. లక్షా పది వేల మందికి సామర్థ్యమున్న ఆ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో ఇరు జట్లు భీకర పోరుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. అయితే అరుదైన రికార్డులకు కొందరు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు. ఆ ఘనతలను మొతెరా వేదికగా నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇంతకీ ఆ రికార్డులేంటంటే..
విరాట్కు మరో విజయం..
స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత సారథిగా నిలవడానికి కోహ్లీ మరో విజయం దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఆ జాబితాలో కోహ్లీ, ధోనీ 21 విజయాలతో సమానంగా ఉన్నారు. అయితే విరాట్ 28 టెస్టుల్లో గెలవగా మహీ 30 టెస్టుల్లో సాధించాడు. కాగా, టెస్టుల్లో ఎక్కువ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ (34) ఐదో స్థానంలో ఉన్నాడు. గ్రేమ్ స్మిత్ (53), పాంటింగ్ (48), స్టీవ్ వా(41), క్లైవ్ లాయిడ్ (36) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
37 పరుగులు..
బ్యాట్స్మెన్గానూ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. 37 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 7500 పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ 89 టెస్టుల్లో 52 సగటుతో 7463 పరుగులు చేశాడు.
అశ్విన్కు ఆరు వికెట్లు..