అఫ్గానిస్థాన్ జట్టులో ధోనీగా పేరు తెచ్చుకున్న మహ్మద్ షెజాద్పై నిషేధాన్ని ఎత్తివేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు(ఏసీబీ). మళ్లీ యధావిధిగా ఆడొచ్చని క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. కానీ కాంట్రాక్ట్పై బ్యాన్.. ఈ ఏడాది ఆగస్టు వరకు ఉంటుందని తన ట్విట్టర్లో పేర్కొంది.
అఫ్గానిస్థాన్ 'ధోనీ'పై నిషేధం తొలగింపు - sports news
వికెట్ కీపర్ బ్యాట్స్మన్ మహ్మద్ షెజాద్పై విధించిన నిషేధాన్ని తొలగించింది ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు. యధావిధిగా క్రికెట్ ఆడొచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.

వికెట్ కీపర్ బ్యాట్స్మన్ మహ్మద్ షెజాద్
నియమ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా షెజాద్.. ఏడాదిపాటు ఎటువంటి క్రికెట్ ఆడకూడదంటూ గతేడాది ఆగస్టులో స్పష్టం చేసింది ఏసీబీ. కానీ, ఏడు నెలల తర్వాత క్రమశిక్షణ కమిటీ అతడిపై నిషేధాన్ని తొలగించింది.
గతేడాది ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచకప్ మధ్యలో మోకాలి గాయం కారణంగా షెజాద్.. జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే తనను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని, తనకేం గాయం కాలేదని చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.
Last Updated : Mar 2, 2020, 3:47 PM IST