భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కుమార్తెపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుజరాత్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడు 16ఏళ్ల యువకుడని పేర్కొన్నారు.
"కొన్ని రోజుల క్రితం.. ధోని కుమార్తెకు అసభ్యకరమైన రీతిలో బెదిరింపులు వచ్చాయి. ధోని భార్య సాక్షికి.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ బెదిరింపులు అందాయి. ఇందుకు సంబంధించి.. 12వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నాం."
-- సౌరభ్ సింగ్, కుచ్ ఎస్పీ.