ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చూపిస్తున్న టీమిండియా.. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ దూసుకెళ్తోంది. టెస్టుల్లో అగ్రస్థానం, వన్డే, టీ20ల్లో రెండులో ప్రస్తుతం కొనసాగుతోంది. అన్ని చోట్లా ఆకట్టుకునే భారత్.. కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రం తుదిమెట్టుపై బోల్తాపడుతోంది. ఈ విషయంపై తాజాగా మాట్లాడాడు ఓపెనర్ రోహిత్ శర్మ. మహిళా క్రికెటర్లు సృతి మంధాన, జెమీమా రోడ్రిగ్జ్తో జరిగిన లైవ్ చాట్ సెషన్లో ఈ విషయాలను పంచుకున్నాడు.
"ఐసీసీ టోర్నీల్లో టీమిండియా.. ముంబయి ఇండియన్స్లా ఆడాలి. ఐపీఎల్లో మా జట్టు పరాజయాలతో ప్రారంభించినా, విజయాలతో టోర్నీని ముగిస్తుంది. ఇదే తరహాలో భారత్.. తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలి"
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్