తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియాపై స్ట్రెయిన్ ప్రభావం.. కఠిన క్వారంటైన్! - గబ్బా టెస్టు కఠిన క్వారంటైన్​లో భారత్

బ్రిస్బేన్​లో టీమ్​ఇండియా బసచేస్తున్న హోటల్​లో కొవిడ్​ నిబంధనలను కఠినతరం చేశారు. భారత ఆటగాళ్లు ఉన్న హోటల్​కు సమీపంలో యూకే స్ట్రెయిన్ కేసు నమోదవ్వడం వల్ల ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు క్వీన్స్​ల్యాండ్​ ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు.

Team India in strictest quarantine in Brisbane as UK Covid-19 strain traced to nearby hotel
బ్రిస్బేన్: టీమ్​ఇండియా హోటల్​ పక్కనే కరోనా స్ట్రెయిన్ వైరస్

By

Published : Jan 13, 2021, 11:52 AM IST

బ్రిస్బేన్​లో టీమ్​ఇండియా ఉంటున్న హోటల్​లో కఠిన క్వారంటైన్ నిబంధనలను విధించారు. ఆ పక్కనే ఉన్న మరో హోటల్​లో కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసు బయటపడింది. దీంతో భారత క్రికెటర్లు, సిబ్బంది మరిన్ని ఆంక్షల నడుమ బసచేస్తున్నారు.

జనవరి 15న ప్రారంభమయ్యే నాలుగో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్​ వెళ్లింది టీమ్​ఇండియా. కరోనా కేసులు వెలికిచూసిన గ్రాండ్ ఛాన్సెలర్ హోటల్​లోని అతిథులను క్వీన్స్​లాండ్ ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లోని హోటల్లలోకి తరలించింది .

భారత క్రికెటర్లు ఉంటున్న హోటల్​లో సౌకర్యాలు సరిగ్గా లేవని క్రికెట్​ ఆస్ట్రేలియాకు బీసీసీఐ లేఖ రాసింది. జిమ్, స్విమ్మింగ్​పూల్​లను కూడా వాడుకోనివ్వడంలేదని పేర్కొంది. అయితే క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటామని సీఏ హామీ ఇచ్చింది.

ఇదీ చూడండి:ఆసీస్​తో నాలుగో టెస్టుకు అందుబాటులో సెహ్వాగ్​!

ABOUT THE AUTHOR

...view details