తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత..

టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ మాధవ్ ఆప్టే (86) నేడు (సోమవారం) ముంబయిలో మరణించారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన ఉదయం కన్నుమూసినట్లు తనయుడు వామన్ తెలిపారు.

By

Published : Sep 23, 2019, 4:23 PM IST

Updated : Oct 1, 2019, 5:07 PM IST

మాధవ్ ఆప్టే

భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) సోమవారం ఉదయం మరణించారు. అనారోగ్యం కారణంగా ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిన ఆయన ఉదయం కన్నుమూసినట్లు కుమారుడు వామన్ మీడియాకు తెలిపారు. టెస్టుల్లో ఓపెనర్​గా ఏడు మ్యాచ్​లు ఆడారు మాధవ్. 13 ఇన్నింగ్స్​ల్లో 542 పరుగులు చేశారు.

1952-53 సీజన్​లో పాకిస్థాన్​పై తొలిసారి టెస్టు సిరీస్​కు ఎంపికై మంచి ప్రదర్శన చేశారు. అనంతరం 1953లో ఇంగ్లాండ్​ పర్యటనకు ఎంపికైన మాధవ్ ఓవల్​లో జరిగిన టెస్టులో భారీ శతకంతో ఆకట్టుకున్నారు. 163 పరుగులు చేసి భారత్​ను ఓటమి నుంచి తప్పించారు. 1989లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేసిన ఈ దిగ్గజ బ్యాట్స్​మన్ క్రికెట్ ఆడేందుకుసచిన్​కు మెంబర్​షిప్ ఇచ్చారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో 67 మ్యాచ్​లు ఆడిన మాధవ్.. 102 ఇన్నింగ్స్​ల్లో 3,336 పరుగులు చేశారు. ఇందులో ఆరు శతకాలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. 1951-52 సీజన్​లో ముంబయి తరఫున రంజీలో అరంగేట్రం చేసి.. తొలి మ్యాచ్​లోనే సౌరాష్ట్రపై శతకం బాది గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదీ చదవండి: 'పంత్​ను లోయర్​ ఆర్డర్​లో పంపించాలి'

Last Updated : Oct 1, 2019, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details