తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2019, 4:54 PM IST

Updated : Sep 28, 2019, 3:09 AM IST

ETV Bharat / sports

జైట్లీకి నివాళి.. నల్ల బ్యాడ్జీలతో భారత ఆటగాళ్లు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి నివాళిగా వెస్టిండీస్​తో తొలి టెస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించాలని నిర్ణయించారు భారత క్రికెటర్లు. ఆంటిగ్వా వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

టీమిండియా టెస్టు జట్టు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ.. శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతికి నివాళిగా వెస్టిండీస్​తో మ్యాచ్​లో నల్ల బ్యాడ్జీలు ధరించాలని భారత క్రికెటర్లు నిర్ణయించారు.

జైట్లీ.. దిల్లీ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీసీఐలో ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ

ఆంటిగ్వాలో తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 297 పరుగులకు ఆలౌట్ అయింది టీమిండియా. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్​.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హోల్డర్​, కమిన్స్ ఉన్నారు.

భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో రాణించాడు. మిగతా వారిలో బుమ్రా, జడేజా, షమి తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇది చదవండి: అరుణ్​ జైట్లీ మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

Last Updated : Sep 28, 2019, 3:09 AM IST

ABOUT THE AUTHOR

...view details