తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్పత్రిలో చేరిన సచిన్​ తెందుల్కర్​ - Sachin Tendulkar

టీమ్​ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఆసుపత్రిలో చేరాడు. ఇటీవల కొవిడ్ బారిన పడిన అతను.. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాడు.

Team India cricket legend Sachin Tendulkar has been admitted to hospital.
మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన సచిన్​

By

Published : Apr 2, 2021, 11:19 AM IST

Updated : Apr 2, 2021, 12:00 PM IST

టీమ్​ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ ఆస్పత్రిలో చేరాడు. ఐదు రోజుల క్రితం కొవిడ్ వచ్చినట్లు వెల్లడించిన మాస్టర్ బ్లాస్టర్​.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపాడు.

అయితే తన కుటుంబ సభ్యులెవరికీ పాజిటివ్ రాలేదని సచిన్​ తెలిపాడు.

"నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాను. త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."

-సచిన్​ తెందుల్కర్, మాజీ క్రికెటర్.

2011 ప్రపంచకప్​ గెలిచి పదేళ్లు అయిన సందర్భంగా క్రికెట్​ అభిమానులతో పాటు తన సహచరులకు శుభాకాంక్షలు తెలియజేశాడు మాస్టర్​. ఇటీవల జరిగిన రోడ్​ సేఫ్టీ సిరీస్​లో పాల్గొన్న సచిన్​తో పాటు పఠాన్ సోదరులు, బద్రీనాథ్​కు కొవిడ్ నిర్ధరణ అయ్యింది.

ఇదీ చదవండి:దిగ్గజ క్రికెటర్ సచిన్​కు కరోనా పాజిటివ్​

Last Updated : Apr 2, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details