తమకు ఐపీఎల్ ఎంత ముఖ్యమో, అంతర్జాతీయ క్రికెట్ మండలికి టీ20 ప్రపంచకప్ అంతే ముఖ్యమని చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ టోర్నీని ఐసీసీ అంత సులువుగా వదులుకోదని, నిర్వహించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుందని అన్నారు.
"టీ20 ప్రపంచకప్ను జరిపేందుకు ఐసీసీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఎందుకంటే దీనిని నిర్వహిస్తే వారికి చాలా ఆదాయం వస్తుంది. మాకు(బీసీసీఐ) ఐపీఎల్ ఎలానో.. ఐసీసీకి ప్రపంచకప్ అలాంటిది. వారు అంతా సులువుగా ఈ టోర్నీని వదులుకోరని నా అభిప్రాయం. ఈ విషయంపై ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం"
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ