తెలంగాణ

telangana

'సిడ్నీటెస్టులో మాదే విజయం.. ఘనత వారికే సొంతం!'

By

Published : Jan 11, 2021, 4:52 PM IST

ఆసీస్​తో జరిగిన మూడో టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్​, విహారిలపై టీమ్​ఇండియా తాత్కాలిక సారథి రహానె ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసినా.. భారత జట్టుకు అది విజయంలాంటిదని అభిప్రాయపడ్డాడు.

raheny
రహానె

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును డ్రాగా ముగించడంపై హర్షం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె.​ ఈ ఫలితాన్ని తాము విజయంగా భావిస్తున్నట్లు అన్నాడు. ఈ పోరులో ప్రతి ఆటగాడు తమ వంతు కృషి చేశాడని జట్టును అభినందించాడు.

"ఈ టెస్టులో మేము గెలిచామని భావిస్తున్నాం. విదేశీ గడ్డపై మ్యాచులను ఇలా ఆడితేనే ప్రత్యేకంగా ఉంటుంది. పుజారా, రోహిత్​, పంత్ బాగా ఆడినప్పటికీ ముఖ్యంగా ఈ ఘనతంతా అశ్విన్​, విహారిలకే చెందుతుంది. చివరి 2.5గంటల్లో వారు చేసిన బ్యాటింగ్​ అమోఘం" అని రహానె అన్నాడు.

రవిచంద్రన్​ అశ్విన్, హనుమ​ విహారి

"ఈ పోరులో విహారి 161 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్​ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నెమ్మదైన ఇన్నింగ్స్​ విహారి కెరీర్​లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. గత మూడు టెస్టుల నుంచి విహారి చాలా బాగా బ్యాటింగ్​ చేస్తున్నాడు. అతడు భారీ స్కోరు చేయనప్పటికీ కానీ ఈ రోజు చాలా బాగా ఆడాడు. అతడి కెరీర్​లో సెంచరీ చేసిన దాని కన్నా ఈ ఇన్నింగ్స్​ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గాయపడినప్పటికీ అతడు ఆడిన బ్యాటింగ్ చేసిన విధానం మిగతా ఆటగాళ్లలో స్ఫూర్తినిచ్చింది. జట్టు కోరుకున్నది సాధించాడు. అందుకే ఈ ఘనతంతా అతడికే సొంతం. కాగా, ఆస్ట్రేలియాకు వరల్డ్ క్లాస్​ బౌలింగ్​​ విభాగం ఉంది. ఆ జట్టులో ఉన్న ముగ్గురు ఫాస్ట్​ బౌలర్లు గొప్ప ఆటగాళ్లు. వారు వ్యక్తిగతంగా కాకుండా జట్టు కోసం చివరిదాకా పోరాడారు. వారిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను."

-రహానె, టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​

ఈ పోరులో పంత్​ ఐదో స్థానంలో బ్యాటింగ్​కు దిగి 97 పరుగులు చేసి మ్యాచ్​లో కీలక మలుపుగా మారాడని రహానె అభిప్రాయపడ్డాడు. "పంత్​ జట్టులో నాణ్యమైన ఆటగాడు. ఈ మ్యాచ్​లో అతడి ఆటకు ముగ్ధుడ్ని అయ్యాను. ఏ స్థానంలో బరిలో దిగిన జట్టును విజయంవైపు నడిపించడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. రోజురోజుకు ఆటలో మెరగవుతున్నాడు." అని పంత్​ను రహానె ప్రశంసించాడు.

సిడ్నీలో తలపడిన మూడో టెస్టులో.. 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగింది టీమ్ఇండియా. 98/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించి.. మరో 3 వికెట్లు కోల్పోయి 131 ఓవర్లలో 334/5 స్కో సాధించింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు‌ డ్రాగా ముగిసింది.

ఇదీ చూడండి : డ్రాగా ముగిసిన భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు

ABOUT THE AUTHOR

...view details