టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అతడితో ఎలా ముందుకు వెళ్లాలన్నది ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ చేతుల్లో ఉందన్నాడు సీనియర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా. రైనా, ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్నారు. రానున్న ఐపీఎల్ సీజన్లో రాణించాలని చెన్నైలో రైనా, అంబటి రాయుడు ఇప్పటికే సాధన మొదలుపెట్టారు. మార్చి తొలి వారంలో ధోనీ, వారితో కలిసి ప్రాక్టీసు ప్రారంభించే అవకాశం ఉందని రైనా చెప్పాడు.
"ఐపీఎల్ కోసం సాధన చేసేందుకు ధోనీ.. మార్చి తొలి వారంలో చెన్నైకు రావచ్చు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలకాలని భావిస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా వైదొలుగుతాడు. అయితే అతడు క్రికెట్ ఆడటాన్ని చూడాలనుకుంటున్నా. ఇప్పటికీ ధోనీ ఎంతో ఫిట్గా ఉన్నాడు. కఠోర సాధన చేస్తున్నాడు. టీమిండియాకు అతడి అవసరం ఉందని భావిస్తున్నా. అయితే అతడితో ఎలా ముందుకు వెళ్లాలన్నది విరాట్ చేతుల్లో ఉంది" -సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్