30 ఏళ్లకు పైబడిన భారత క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించాలని టీమిండియా సీనియర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్తో జరిగిన ఇన్స్టా లైవ్లో ఈ విషయమై చర్చించాడు. సదరు లీగుల్లో ఆడేందుకు ఆటగాళ్లను అనుమతించడంపై బోర్డు పునరాలోచించుకోవాలని పఠాన్ అన్నాడు.
"బీసీసీఐతో కాంట్రాక్ట్ లేని క్రికెటర్లను విదేశీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతించాలి. కనీసం రెండు లీగుల్లో అయినా ఆడే అవకాశం కల్పించాలి. వాటిలో పాల్గొనడం ద్వారా మా స్కిల్స్ను మరింత పెంచుకోవచ్చు. అందులో బాగా ఆడితే జాతీయ జట్టులోనూ ఛాన్స్ రావొచ్చేమో" -రైనా, సీనియర్ క్రికెటర్