తెలంగాణ

telangana

సూపర్​ ఓవర్​​లు మాకు స్నేహితులు కాదు: విలియమ్సన్​​

హామిల్టన్​ వేదికగా భారత్​తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్​ ఓటమిపాలైంది. సూపర్​ ఓవర్​కు దారితీసిన ఈ మ్యాచ్​లో కివీస్​ జట్టు 18 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దాన్ని ఛేదించింది భారత జట్టు. అయితే ఓటమి అనంతరం మాట్లాడిన ఆ జట్టు సారథి కేన్​ విలియమ్సన్​.. సూపర్​ ఓవర్​ వారికి స్నేహితులు కాదని అభిప్రాయప్డడాడు.

By

Published : Jan 29, 2020, 8:22 PM IST

Published : Jan 29, 2020, 8:22 PM IST

Updated : Feb 28, 2020, 10:44 AM IST

"Super Overs aren't really New Zealand's friend," skipper Kane Williamson
'సూపర్​ ఓవర్లు​ మాకు స్నేహితులు కాదు'

స్వదేశంలో టీ20 సిరీస్​ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో ఓడిపోయింది న్యూజిలాండ్​ జట్టు. ఇవాళ జరిగిన మూడో టీ20లో పరాజయం చెంది సిరీస్‌ను 0-3తో టీమిండియాకు అప్పగించింది. తొలి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోని కివీస్​.. మూడో టీ20లో మాత్రం గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. ముఖ్యంగా సారథి కేన్​ విలియమ్సన్​ అద్భుతంగా రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు. అయితే తాజా ఓటమిపై స్పందించాడు విలియమ్సన్‌. సూపర్‌ ఓవర్‌లు వారికి స్నేహితులు కాదని అభిప్రాయపడ్డాడు.

"మాకు సూపర్‌ ఓవర్‌లు కలసి రావడం లేదు. అవి మాకు నిజంగా స్నేహితులు కాదు. అందుకే మేము మామూలు మ్యాచ్‌ల్లోనే గెలవాలి. క్రికెట్‌ ఎంతో గొప్ప ఆట. ఏ చిన్న తప్పు దొర్లినా విజేత మారిపోతారు. కీలక సమయంలో టీమిండియా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈ విషయంలో మేము భారత్‌ నుంచి ఎంతో నేర్చుకోవాలి. టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా మా బౌలర్లు తిరిగి పుంజుకొని అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ రోజు నా బ్యాటింగ్‌ పట్ల సంతృప్తిగా ఉన్నాను. మిడిల్‌ ఓవర్లలో భాగస్వామ్యాలు నమోదు చేశాను. కానీ మ్యాచ్‌ను విజయంతో ముగించకపోవడం దురదృష్టకరం. ఓటమి గురించి సభ్యులతో చర్చించుకోవాలి. మేము మరింత మెరుగుపడాలి. ముఖ్యంగా ఒత్తిడిలో జయించడం నేర్చుకోవాలి".

-- కేన్​ విలియమ్సన్‌, న్యూజిలాండ్​ కెప్టెన్​

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో కివీస్​ జట్టు బ్యాట్స్​మన్​ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. సారథి కేన్​ విలియమ్సన్​ ఒంటరి పోరాటం చేశాడు. 48 బంతుల్లో 95 పరుగుల (8 ఫోర్లు, 6 సిక్సర్లు)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే మ్యాచ్​ కివీస్‌ సొంతం అనుకున్న సమయంలో... 20వ ఓవర్‌లో షమి అద్భుతమైన బౌలింగ్​కు ఔటయ్యాడు కేన్​. ఆఖరి మూడు బంతుల్లో 5 పరుగులు చేయలేక మ్యాచ్​ను 'టై' చేసుకుంది బ్లాక్​క్యాప్స్​ జట్టు. తర్వాత సూపర్​ ఓవర్​ జరగ్గా అందులో రోహిత్​ రెండు సిక్సర్లు, రాహుల్​ ఫోర్​ కొట్టి భారత్​కు విజయాన్ని అందించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది.

Last Updated : Feb 28, 2020, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details