తెలంగాణ

telangana

'క్రికెట్​ కంటే భావితరాల చదువు ముఖ్యం'

By

Published : Apr 25, 2020, 4:05 PM IST

వీలైనంత త్వరగా విద్యాసంస్థలు ప్రారంభమవ్వాలని భారత మాజీ దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్​ కంటే విద్యార్థుల చదువులే ముఖ్యమని తెలిపారు. కరోనా పోరులో భారత్​-పాక్​ జట్లు మూడు వన్డేల సిరీస్​ను ఆడాలన్న షోయబ్​ అక్తర్​ కోరికపై స్పందించారు కపిల్​దేవ్​.

Studying posterity is more important than cricket: Kapil Dev
క్రికెట్​ కంటే భావితరాల వారి చదువు ముఖ్యం

కరోనా వైరస్‌ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో.. క్రికెట్‌ కన్నా ముందు విద్యాసంస్థలు తెరచుకోవాలని టీమ్‌ఇండియా లెజెండరీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌ పునరుద్ధరణ గురించి కాకుండా విద్యార్థుల చదువుల గురించి ఆలోచించాలని సూచించారు.

"నేను విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రికెట్‌ గురించి మాట్లాడటం సమంజసం కాదు. నేనైతే విద్యార్థుల చదువుల గురించి ఆందోళన చెందుతున్నా. వాళ్లంతా మన భావితరాలు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నేనైతే.. ముందు విద్యాసంస్థలు తెరచుకోవాలని అనుకుంటున్నా. ఆ తర్వాత క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వాటంతటవే పునఃప్రారంభం అవుతాయి."

-కపిల్ దేవ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఈ సందర్భంగా కపిల్‌ మరోసారి షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. కరోనాపై పోరులో విరాళాల సేకరణకు భారత్‌-పాక్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఆడాలని అక్తర్‌ సూచించారు. ఇదివరకే దీన్ని ఖండించిన కపిల్‌ మరోసారి తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. "అక్తర్‌ చెప్పిన విషయాన్ని భావోద్వేగంగా ఆలోచిస్తే అవుననే అంటారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు ఆడొచ్చు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌లు ఆడటం ముఖ్యం కాదు. మీకు డబ్బు అవసరమైతే ముందు బోర్డర్‌లో పరిస్థితులు అదుపు చేయండి" అని అన్నారు.

ఇదీ చూడండి.. 'ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా'

ABOUT THE AUTHOR

...view details