తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 10:44 AM IST

ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: చెన్నై మొగ్గు యువకుల వైపేనా..!

గురువారం జరగనున్న ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్​ జట్టు యువ ఆటగాళ్లవైపే మొగ్గు చూపే అవకాశముంది. సీఎస్​కే వద్ద అందుబాటులో ఉన్న నగదు రూ.14.60కోట్లు.

Strategy of Chennai Super Kings IPL 2020 Auction
ఐపీఎల్ వేలం: చెన్నై మొగ్గు యువకుల వైపేనా..!

ఐపీఎల్​-2020 వేలం.. ఈ నెల 19న కోల్​కతాలో జరగనుంది. అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. ఏ క్రికెటర్ ఎంత ధర పలుకుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్ జట్టు ఎలాంటి ఆటగాళ్ల వైపు మొగ్గుచూపుతుందో.. చెన్నై వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు

మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, డుప్లెసిస్, అంబటి రాయుడు, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మను కుమార్, జగదీషన్, హర్భజన్ సింగ్, కరణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కేఎమ్ ఆసిఫ్

వదులుకున్న ఆటగాళ్లు

మోహిత్ శర్మ, సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లే, స్కాట్ కుగెలెజ్, ధ్రువ్ శోరే, చైతన్య బిష్నోయ్

అందుబాటులో ఉన్న నగదు :రూ.14.60 కోట్లు

తీసుకునే అవకాశం ఉన్నది : 5 (3 స్వదేశీ, 2 విదేశీ ఆటగాళ్లు)

వ్యూహం..

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ ఆరంభం నుంచి ప్రస్తుతమున్న ఆటగాళ్ల మీదే ఆధారపడుతుంది. ఈసారి అందుకు భిన్నమేమీ కాదు. ఇప్పటికే 20 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. మోహిత్ శర్మ, సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లే వదులుకున్న సీఎస్​కేకు ప్రస్తుతం ఓ బ్యాకప్ ఇండియన్ సీమర్, ఓవర్సీస్ బ్యాట్స్​మన్, ఓవర్సీస్ సీమర్ కావాలి. యువ భారత బ్యాట్స్​మన్ వైపు దృష్టిసారించొచ్చు.

దృష్టిసారించే ఆటగాళ్లు...

జయదేవ్ ఉనద్కత్, ఆండ్రూ టై, బెన్ లాలిన్, హనుమ విహారి, రాహుల్ త్రిపాఠి, షారుక్ ఖాన్, బరిందర్ శరణ్, టామ్ బాంటన్, అలెక్స్ కేరీ, సామ్ కరన్, సిమన్స్, జలజ్ సక్సేనా.

ఇదీ చదవండి: విశాఖ వన్డే: కోహ్లీసేన ఈ రికార్డులు బద్దలు కొడుతుందేమో..!

ABOUT THE AUTHOR

...view details