తెలంగాణ

telangana

ETV Bharat / sports

'శ్రీశాంత్​ వేటుపై పునఃసమీక్షించండి'

ఐపీఎల్​లో స్పాట్​ ఫిక్సింగ్​ ఆరోపణలు ఎదుర్కొన్న పేసర్​ శ్రీశాంత్​ వేటుపై సుప్రీంకోర్టు స్పందించింది. అతడికి విధించిన శిక్షపై పునఃసమీక్షించాలని బీసీసీఐ అంబుడ్స్​మెన్ (స్వతంత్ర న్యాయాధికారి)కి సూచించింది.

By

Published : Apr 6, 2019, 3:38 PM IST

'శ్రీశాంత్​పై వేసిన శిక్షను ఓ సారి సమీక్షించండి'

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో నిషేధం ఎదుర్కొంటున్న​ భారత పేసర్​ శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయమై పునఃసమీక్షించాలని సూచిస్తూ.. ఆ అధికారాన్ని బీసీసీఐ అంబుడ్స్​మెన్​కు అప్పగించింది సుప్రీంకోర్టు. 3 నెలల్లోగా ఈ విషయంపై బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకుంటారని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వెల్లడించింది.

  1. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించాడీ ఆటగాడు.
  2. మార్చి 15న శిక్ష తగ్గించే విషయమై పునరాలోచించాలని బీసీసీఐకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే ప్రస్తుతం ఇచ్చిన తీర్పు శ్రీశాంత్​పై దిల్లీ హైకోర్టులో ఉన్న క్రిమినల్​ ప్రొసీడింగ్స్​పై ఎటువంటి ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది.

ABOUT THE AUTHOR

...view details