తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ పర్యటనకు సిద్ధమైన లంక జట్టుకు ఉగ్రముప్పు! - srilanka cricket board

పాకిస్థాన్​లో పర్యటనకు సిద్ధమవుతున్న తమ​ జట్టుకు ఉగ్రముప్పు ఉన్నట్లు హెచ్చరికలు వచ్చాయని లంక బోర్డు తెలిపింది. ఆటగాళ్ల భద్రత కారణాల దృష్ట్యా మరోసారి పాక్​ పరిస్థితులు సమీక్షించేందుకు తమ రక్షణ బృందాన్ని పంపనున్నట్లు వెల్లడించింది.

పాక్​లో పర్యటనకు సిద్ధమైన లంక జట్టుకు ఉగ్రముప్పు...!

By

Published : Sep 12, 2019, 7:59 AM IST

Updated : Sep 30, 2019, 7:26 AM IST

భద్రత కారణాలతో కెప్టెన్​ కరుణరత్నె, మలింగ, మాథ్యూస్​ సహా పది మంది సీనియర్​ ఆటగాళ్లు పాకిస్థాన్​ వెళ్లడానికి నిరాకరించినా.. పర్యటనను రద్దు చేయలేదు శ్రీలంక బోర్డు. ఆ దేశంలో మ్యాచ్​లకు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అయినా శ్రీలంక జట్లు పాకిస్థాన్​లో పర్యటించడం అనుమానంగానే ఉంది. పర్యటన సందర్భంగా తమ ఆటగాళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే ప్రమాదం ఉందని హెచ్చరికలు వచ్చినట్టు లంక బోర్డు తెలిపింది. పాక్​లో భద్రత పరిస్థితులు మరోసారి సమీక్షించాలని ప్రధానమంత్రి కార్యాలయం తమకు సూచించినట్లు చెప్పింది.

సెప్టెంబర్​ 27 నుంచి అక్టోబర్​ 9 వరకు ఈ పర్యటనలో లంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్​కు కెప్టెన్​గా లాహిరు తిరిమన్నే, టీ20 జట్టుకు దసున్​ను బోర్డు నియమించింది.

వన్డే జట్టు:

లాహిరు తిరుమన్నే(కెప్టెన్), ధనుష్క గుణతిలక, సధీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో, ఒషాడా ఫెర్నాండో, షెహన్​ జయసూర్య, దసున్​ శంకర, మినోద్​ భానుక, ఏంజిలో పెరెరా, వనిందు హసరంగా, లక్షన్​ సందకన్​, నువాన్​ ప్రదీప్​, ఇసురు ఉదాన, కసున్​ రజిత, లాహిరు కుమార

టీ20 జట్టు:

దసున్ శనక(కెప్టెన్), ధనుష్క గుణతిలక, సధీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో,ఒషాడా ఫెర్నాండో, షెహన్​ జయసూర్య, ఏంజిలో పెరెరా, భానుక రాజపక్ష, మినోద్​ భానుక, లాహిరు మదుశంక, వనిందు హసరంగ, లక్షన్​, నువాన్​ ప్రదీప్​, కసున్​ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదాన

ఇవీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details