తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో శ్రీలంక​ బౌలర్​ చెత్త రికార్డు

ఆడిలైడ్​ వేదికగా ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య ఆదివారం జరిగిన టీ20లో ఓ చెత్త రికార్డు నమోదైంది. లంక జట్టుకు చెందిన కసున్​ రజిత... ఈ ఫార్మాట్​లోనే దారుణమైన గణాంకాలు నెలకొల్పాడు.

By

Published : Oct 27, 2019, 6:28 PM IST

టీ20ల్లో ఈ శ్రీలంకన్​ బౌలర్​దే చెత్త రికార్డు

ఆసీస్​, శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20లో శ్రీలంక పేసర్​ కసున్​ రజిత చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. ఆడిలైడ్​ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో కెరీర్​లోనే దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన రజిత...75 పరుగులు ఇచ్చి, టీ20ల్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.

పొట్టి ఫార్మాట్​లో భారీగా పరుగులు సమర్పించుకున్న తునాహన్​ తురాన్​(టర్కీ) ఆటగాడి రికార్డును అధిగమించాడు. ఇదే ఏడాది ఆగస్టులో చెక్​ రిపబ్లిక్​తో మ్యాచ్​లో తునాహన్​..​ 70 పరుగులు ఇచ్చాడు.

వార్నర్​ దంచేశాడు...

ఈ మ్యాచ్​లో 56 బంతుల్లో శతకం చేశాడు ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​. ఇతడి విధ్వంసం దెబ్బకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి​ 233 పరుగులు చేసింది ఆసీస్​. మరో ఓపెనర్​ అరోన్​ ఫించ్​ 64, మ్యాక్స్​వెల్​ 62 పరుగులు చేశారు. స్వదేశంలో జరిగిన టీ20ల్లో కంగారూల అత్యధిక స్కోరు ఇదే. 2007లో సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్​పై 221 పరుగులు చేసిందీ జట్టు.

భారీ లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేశారు లంకేయులు. ఫలితంగా 134 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. బ్రిన్బేన్​ వేదికగా బుధవారం రెండో టీ20, మెల్​బోర్న్​లోశుక్రవారం మూడో టీ20 జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details