తెలంగాణ

telangana

ETV Bharat / sports

పదేళ్ల తర్వాత పాకిస్థాన్​లో టెస్టు.. సిద్ధమైన శ్రీలంక

పాకిస్థాన్​లో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇటీవల శ్రీలంక అంగీకరించింది. ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్​ డిసెంబర్ 11 నుంచి 23 వరకు జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్​ల కోసం జట్టును ప్రకటించింది లంక బోర్డు.

By

Published : Nov 30, 2019, 9:44 AM IST

srilanka announced test team for playing at Pakistan in December after 10 years
పదేళ్ల తర్వాత పాకిస్థాన్​లో టెస్టు... జట్టుతో సిద్ధమైన శ్రీలంక

పాకిస్థాన్​లో క్రికెట్ పునరుద్ధరణకు పీసీబీ చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇటీవలే శ్రీలంక.. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్​ ఆడింది. అయితే టెస్టు​లు ఆడేందుకు కొంత సందిగ్ధం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత అంగీకరించింది. ఇందులో భాగంగా రెండు మ్యాచ్​ల సిరీస్​కు తాజాగా జట్టును ప్రకటించింది లంక బోర్డు. ఫలితంగా దాదాపు దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు క్రికెట్​ను ఆస్వాదించనున్నారు పాక్ అభిమానులు.

పాకిస్థాన్‌లో రెండు టెస్టుల సిరీస్‌ కోసం శ్రీలంక బలమైన జట్టును బరిలో దింపింది. మాజీ కెప్టెన్‌ దినేశ్‌ చండిమల్‌ చోటు దక్కించుకున్నాడు. దిముత్‌ కరుణరత్నె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

శ్రీలంక సారథి దిముత్‌ కరుణరత్నె

సెప్టెంబర్​ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడారు లంక ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు. ఇందులో 3 వన్డేల సిరీస్​ను 2-0 తేడాతో గెలిచింది పాక్​. అయితే 3 టీ20ల సిరీస్​ను లంక జట్టు క్లీన్​స్వీప్​ చేసింది. తాజాగా టెస్టు పర్యటనకు సిద్ధమౌతోంది. రావల్పిండి వేదికగా డిసెంబర్‌ 11-15 వరకు మొదటి టెస్టు, కరాచీ వేదికగా 19-23 మధ్య రెండో టెస్టు జరుగుతుంది.

జట్టు ఇదే....

దిముత్‌ కరుణరత్నె (కెప్టెన్‌), ఒషాడా ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఏంజెలో మాథ్యూస్‌, దినేశ్‌ చండిమల్‌, కుశాల్‌ పెరీరా, లహిరు తిరమన్నె, ధనంజయ డిసిల్వా, నిరోషన్‌ డిక్వెల్లా, దిల్రువన్‌ పెరీరా, లసిత్‌ ఎంబుల్డెనియా, సురంగా లక్మల్‌, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, కసున్‌ రజిత, లక్షణ్‌ సందకన్‌.

ABOUT THE AUTHOR

...view details