తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2021, 9:56 AM IST

Updated : Mar 26, 2021, 10:09 AM IST

ETV Bharat / sports

సెంచరీ మిస్.. కానీ క్రికెటర్ సరికొత్త రికార్డు

టెస్టుల్లో సెంచరీ చేయకుండా ఎక్కువ అర్ధశతకాలు చేసిన క్రికెటర్​గా నిరోషన్ డిక్​వెల్లా నిలిచాడు. ఈ క్రమంలో భారత క్రికెటర్​ను అధిగమించాడు.

sri lanka cricketer Niroshan Dickwella creates record in Tests
నిరోషన్ డిక్​వెల్లా

శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్​వెల్లా టెస్టుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్​తో అంటిగ్వాలో జరిగిన తొలి టెస్టులో ఈ మార్క్​ను అందుకున్నాడు. అయితే ఈ ఫార్మాట్​లో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయకుండా ఈ ఘనత అందుకోవడం విశేషం.

సెంచరీ దగ్గర్లో ఔటైన డిక్​వెల్లా

ఇంతకీ ఆ రికార్డు ఏంటి?

గురువారంతో ముగిసిన శ్రీలంక-వెస్టిండీస్ టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో 96 పరుగులు చేసిన డిక్​వెల్లా మూడంకెల స్కోరు అందుకోకుండానే ఔటయ్యాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 17 అర్ధశతకాలు చేసిన ఇతడు.. ఒక్క సెంచరీ అయినా చేయకుండా ఎక్కువసార్లు 50 పరుగులకు మించి చేసిన క్రికెటర్​గా నిలిచాడు. ఈ క్రమంలో భారత క్రికెటర్ చేతన్ చౌహాన్​ను(16) అధిగమించాడు.

ఇది చదవండి:రెండో వన్డే పోరుకు భారత్-ఇంగ్లాండ్ సై

Last Updated : Mar 26, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details