తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​ కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన లక్ష్మణ్

ఐపీఎల్ కోసం సిద్ధమవుతోంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ సందర్భంగా సీజన్​లో కొత్త ఆటగాళ్లను పరిచయం చేశాడు జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్. అందులో హైదరాబాద్​కు చెందిన సందీప్ భవనక కూడా ఉన్నాడు.

By

Published : Aug 29, 2020, 9:24 AM IST

సన్​రైజర్స్​ కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన లక్ష్మణ్
సన్​రైజర్స్​ కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన లక్ష్మణ్

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం గత ఆదివారం దుబాయ్‌కి చేరుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకుంది. దీంతో ఆటగాళ్లంతా ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నారు. అయితే, శుక్రవారం సన్‌రైజర్స్‌ మెంటార్‌, టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ ఏడాది తమ జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను పరిచయం చేశాడు. అందులో హైదరాబాద్‌కు చెందిన సందీప్‌ భవనక కూడా ఉన్నాడు.

రేపటి నుంచే ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెడుతుందని, టోర్నమెంట్‌ ప్రారంభమైందంటే ఇక వరుస మ్యాచ్‌లతో బిజీగా ఉంటామని తెలిపాడు లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండాలని, ఇదివరకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఎలా ఉందో అలాగే కొనసాగాలని సూచించాడు. అనంతరం కొత్త ఆటగాళ్లని పరిచయం చేసుకోమని చెప్పాడు.

కొత్త ఆటగాళ్లు ఎవరు.. ఏమన్నారు?

  • అబ్దుల్‌ సమద్‌.. జమ్మూ కశ్మీర్‌ నుంచి వచ్చాను. ఇదే నా తొలి ఐపీఎల్‌ టోర్నీ. ఈ సీజన్‌ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇక్కడి కోచ్‌లతో పాటు చాలా మంది సీనియర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలనని అనుకుంటున్నా.
  • భవనక సందీప్‌.. హైదరాబాద్‌ నుంచి వచ్చాను. ఈ సీజన్‌ ఆరంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జట్టు నా నుంచి ఏదైతే ఆశిస్తుందో అదే నా తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. అందుకోసం కృషిచేస్తా.
  • ప్రియమ్‌ గార్గ్‌.. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి. నేనెంతో ఉత్సుకతతో ఉన్నా. ఎందుకంటే ఇదే నా తొలి ఐపీఎల్‌. అవకాశం కోసం వేచి ఉన్నా.

ABOUT THE AUTHOR

...view details