తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 12:27 PM IST

ETV Bharat / sports

'ధోనీ.. నీ కెరీర్​కు ముగింపు పలుకుతాడు'

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీపై నోరుజారిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై బౌలర్​ శ్రీశాంత్ విరుచుకుపడ్డాడు. భవిష్యత్తులో స్టోక్స్​ కెరీర్​కు ధోనీ ముగింపు పలుకుతాడని అన్నాడు.

sreesanth
శ్రీశాంత్​

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మండిపడ్డాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంఘటన గురించి తన జీవితచరిత్ర 'ఆన్​ ఫైర్' పుస్తకంలో ​ ప్రస్తావించాడు బెన్​స్టోక్స్​. అది ధోనీ తప్పిదం వల్లే జరిగినట్లు ఆరోపించాడు. ఇదే విషయాన్ని పాక్​ మాజీ క్రికెటర్లు అనేకసార్లు లేవనెత్తారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన శ్రీశాంత్​.. బెన్​స్టోక్స్​పై విరుచుకుపడ్డాడు.

"ధోనీ ఏదీ సాధారణంగా మర్చిపోడు. కెరీర్‌లో ఇంకెప్పుడూ మహీకి ఎదురుపడకూడదని ప్రార్థించుకో. అతడో ప్రమాదకరమైన ఆటగాడు. ఇంగ్లాండ్​-భారత్​ మ్యాచ్​ లేదా ఐపీఎల్​లో ఎదురుపడితే మాత్రం నీ కెరీర్​కు అతడు ముగింపు పలుకుతాడు. ఇప్పటివరకు నవ్వు బాగా సంపాదించి ఉండవచ్చు.. కానీ అవన్నీ కనుమరుగైపోతాయి. జాగ్రత్త."

-శ్రీశాంత్​, టీమ్​ఇండియా బౌలర్​.

వాస్తవానికి ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉంటే.. పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలిచేది. కానీ.. టీమ్​ఇండియా ఓడిపోవడం వల్ల పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్‌ను రేస్‌ నుంచి తప్పించడానికే భారత్ జట్టు ఆ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందని ఇప్పటికీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.

ఇద చూడండి :పోర్న్​స్టార్​గా మారిన మహిళా కార్ రేసర్

ABOUT THE AUTHOR

...view details