తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీశాంత్ వన్డే జట్టుకు కెప్టెన్​గా గంగూలీ

టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ శ్రీశాంత్ వన్డేల్లో అత్యుత్తమ ఆటగాళ్లతో ఓ జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు సౌరభ్ గంగూలీని కెప్టెన్​గా నియమించాడు.

By

Published : May 29, 2020, 6:51 PM IST

శ్రీశాంత్
శ్రీశాంత్

కొన్ని నెలలుగా లాక్​డౌన్ సమయాన్ని తమకు నచ్చిన వ్యాపకాలతో గడిపేస్తున్నారు క్రికెటర్లు. ఈ ఖాళీ సమయంలో తమకు ఇష్టమైన ఆటగాళ్లతో ఓ అత్యుత్తమ జట్టును తయారు చేస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఓ ప్రపంచ ఎలెవన్​ను రూపొందించాడు. ఈ జట్టుకు మాజీ భారత సారథి సౌరభ్ గంగూలీని కెప్టెన్​గా నియమించాడు.

అయితే గంగూలీ కెప్టెన్సీలో శ్రీశాంత్ ఎక్కువ మ్యాచ్​లు ఆడలేదు. కానీ తన సారథ్యంలో దూకుడు ఉంటుందని అందుకే గంగూలీని కెప్టెన్​గా ఎంచుకున్నట్లు తెలిపాడు శ్రీశాంత్. గంగూలీకి ఓపెనింగ్ జోడీగా సచిన్ తెందూల్కర్​ను ఎంపిక చేశాడు. మూడు, నాలుగో స్థానంలో బ్రియన్ లారా, విరాట్ కోహ్లీను తీసుకున్నాడు. మిడిలార్డర్​లో డివిలియర్స్, యువరాజ్ సింగ్, ధోనీ (కీపర్)లకు చోటు కల్పించాడు. తర్వాత జాక్వెస్ కలిస్​ను ఎంచుకున్నాడు. బౌలింగ్ విభాగానికి వస్తే షేన్ వార్న్, అలెన్ డోనాల్డ్, మెక్​గ్రాత్​ల పేర్లు తెలిపాడు.

శ్రీశాంత్ ఆల్​టైమ్ వన్డే ఎలెవన్

సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ (కెప్టెన్), బ్రియన్ లారా, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ (కీపర్), జాక్వెస్ కలిస్, షేన్ వార్న్, అలెన్ డోనాల్డ్, మెక్​గ్రాత్

ABOUT THE AUTHOR

...view details