తెలంగాణ

telangana

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు

By

Published : Sep 24, 2019, 7:20 PM IST

Updated : Oct 1, 2019, 8:52 PM IST

సూరత్ వేదికగా దక్షిణాఫ్రికా - భారత మహిాళా జట్ల మధ్య తొలి టీ-20 జరుగుతోంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది సఫారీ జట్టు.

దక్షిణాఫ్రికా - భారత్

భారత మహిళా జట్టుతో జరుగుతోన్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా అమ్మాయిలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ బౌలింగ్​కు అనుకూలించే అవకాశం ఉంది.

టీమిండియా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ పొట్టి ఫార్మాట్​ నుంచి వైదొలిగిన తర్వాత జరుగుతోన్న ఈ మ్యాచ్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరుజట్ల మధ్య 5 టీ-20లు జరగనున్న నేపథ్యంలో ఇందులో నెగ్గాలని చూస్తోంది హర్మన్ సేన.

జట్లు:

భారత్​:

హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందాణ్న, షఫాలీ శర్మ, రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, పూజా, తానియా భాటియా(కీపర్), రాధా యాదవ్, శిఖా పాండే.

దక్షిణాఫ్రికా:

సనే లూస్(కెప్టెన్), లీజెల్లే లీ(కీపర్), తాజ్మిన్ బ్రిట్స్, లోరా, నాడిని, మిగ్నన్ డుప్రీజ్, షాంగేజ్, లాబా, షబ్నమ్ ఇస్మాయిల్, ఖాకా, తుమి

ఇదీ చదవండి: ఒలింపిక్ పతకం అంత సులభం కాదు: గ్రాహం రీడ్

Last Updated : Oct 1, 2019, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details