తెలంగాణ

telangana

ETV Bharat / sports

డుప్లెసిస్​ ఘాటు వ్యాఖ్యలు..టీమిండియా ఫ్యాన్స్​ ఫైర్ - దక్షిణాఫ్రికా టెస్టు సారథి డుప్లెసిస్​.

ఇటీవలే టెస్టు సిరీస్​లో దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది టీమిండియా. రెండు టెస్టుల్లోనూ ఇన్నింగ్స్ కొన్ని పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు సఫారీలు. ఈ పరాజయంపై మాట్లాడిన కెప్టెన్ డుప్లెసిస్​... కోహ్లీసేనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియాపై డుప్లెసిస్​ సంచలన వ్యాఖ్యలు... అభిమానులు ఫైర్​

By

Published : Oct 27, 2019, 4:44 PM IST

దక్షిణాఫ్రికా టెస్టు సారథి డుప్లెసిస్​... చీకట్లో తమ వికెట్లు తీసిటీమిండియా గెలిచిందనే వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.​ సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై ట్రోల్స్​, మీమ్స్​తో విమర్శలు చేస్తున్నారు.

ఏమైంది..?

ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్​లో టీమిండియా చేతిలో 3-0 తేడాతో వైట్​వాష్​ అయింది దక్షిణాఫ్రికా. ఒక్క మ్యాచ్​లోనూ సరైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఈ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన సఫారీ కెప్టెన్‌ డుప్లెసిస్‌.. ఓడిపోవడానికి కొత్త కారణం చెప్పాడు. టాస్ ప్రతిసారి కోహ్లీసేనకు అనుకూలంగా రావడం, చీకటిగా ఉన్నప్పుడు భారత్​ ఇన్నింగ్స్​ డిక్లేర్​ చేయడం వంటి కారణాలవల్లే మ్యాచ్​లు​ కోల్పోయామని అన్నాడు.

" ప్రతి టెస్టులో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. 500 పరుగులు చేసి చీకటి సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ ఇచ్చేవారు. ఆ తర్వాత మా జట్టువి మూడు వికెట్లు పడగొట్టేవారు. మూడో రోజు ఆటను ఒత్తిడితో కొనసాగించేవాళ్లం. ప్రతి టెస్టులోనూ ఇదే పునరావృతమైంది"
-- డుప్లెసిస్​, దక్షిణాఫ్రికా సారథి

టాస్‌ లేకపోతే పర్యాటక జట్టుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డాడు డుప్లెసిస్​.

"టాస్​ అనేది లేకపోతే పర్యాటక జట్లకే విజయావకాశాలు ఎక్కువ. దక్షిణాఫ్రికాలో అయితే ఇరుజట్లకు పిచ్​ ఒకేలా ఉంటుంది. కానీ భారత్​లో ఆ పరిస్థితి లేదు. ఆఖరి టెస్టు గొప్పగా ప్రారంభించినా తర్వాత ఒత్తిడికి లోనయ్యాం. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మాజీల సహాయం అవసరం. ఖర్చు ఎక్కువైనా మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలి"
--డుప్లెసిస్‌, దక్షిణాఫ్రికా సారథి

ఈ ఆటగాడి కామెంట్లపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఓటమికి కారణాలు చెప్పకుండా గెలవడానికి ప్రయత్నించు', 'జట్టులో సీనియర్‌ ఆటగాడిగా ఉన్న నువ్వు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావు' అని వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ టెస్టు సిరీస్​ ముందు వాళ్ల దేశంలోనే శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది దక్షిణాఫ్రికా. జనవరి 3 నుంచి ఇంగ్లాండ్​తో తలపడనుంది ప్రోటీస్​ జట్టు.

ABOUT THE AUTHOR

...view details