దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై స్పందించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తర్వాత తన రీఎంట్రీ గురించి ఆలోచిస్తానని తెలిపాడు.
" ప్రస్తుతానికి నా దృష్టి అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్పై ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నా సర్వశక్తుల మేరకు పోరాడతా. తర్వాత ఈ ఏడాదిలో ఏంచేయాలనే దాని గురించి ఆలోచిస్తా. ప్రతి ప్లేయర్ తన పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. నా భార్య, ఇద్దరు కుమారుల కోసం సమయాన్ని వెచ్చించే స్థితికి చేరుకున్నాను. క్రికెట్కు, కుటుంబానికి మధ్య సమతుల్యత ఉండాలని కోరుకుంటున్నా. ఈ రోజుల్లో ప్రముఖ ఆటగాళ్లకు మానసిక, శారీరక ఒత్తిడి భారీగా ఉంది. అయితే ఏం చేయాలో, ఏం చేయకూడదనేది వారే నిర్ణయించుకోవాలి. ఇలాంటి సమయంలో క్రమశిక్షణ అనేది కీలకంగా ఉంటుంది".