అంతర్జాతీయ టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. పురుష క్రికెటర్లకు సాధ్యం కానీ ఓ ఘనతను న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సోఫీ డివైన్ సాధించింది. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన నాలుగో టీ20లో అర్ధశతకంతో మెరిసిన సోఫీ, మొత్తంగా వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా నిలిచింది.
గేల్, రోహిత్, మెకల్లమ్కు సాధ్యం కానీ ఘనత ఆమె సొంతం
టీ20ల్లో స్టార్ క్రికెటర్లు ఇప్పటివరకు సాధించని ఓ రికార్డును కివీస్కు చెందిన సోఫీ డివైన్ నెలకొల్పింది. వరుసగా ఐదు అర్ధసెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా నిలిచింది.
కివీస్ మహిళా క్రికెటర్ సోఫీ డివైన్
ఈ జాబితాలో బ్రెండన్ మెకల్లమ్, మిథాలీ రాజ్.. నాలుగేసి హాఫ్ సెంచరీలతో ఇప్పటికి వరకు తొలిస్థానంలో ఉన్నారు. ఇప్పుడు వీరిని అధిగమించి, అగ్రస్థానానికి చేరుకుంది సోఫీ.
ఈ మ్యాచ్లో సోఫీ 105 పరుగులు చేయడం వల్ల, కివీస్.. 69 పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్లో వరుసగా 54*, 61, 77 పరుగులు నమోదు చేసిందీ మహిళా క్రికెటర్.
Last Updated : Feb 29, 2020, 9:29 PM IST