తెలంగాణ

telangana

ETV Bharat / sports

గేల్, రోహిత్, మెకల్లమ్​కు సాధ్యం కానీ ఘనత ఆమె సొంతం

టీ20ల్లో స్టార్ క్రికెటర్లు ఇప్పటివరకు సాధించని ఓ రికార్డును కివీస్​కు చెందిన సోఫీ డివైన్​ నెలకొల్పింది. వరుసగా ఐదు అర్ధసెంచరీలు చేసిన తొలి క్రికెటర్​గా నిలిచింది.

By

Published : Feb 10, 2020, 5:15 PM IST

Updated : Feb 29, 2020, 9:29 PM IST

గేల్, రోహిత్, మెకల్లమ్​కు సాధ్యం కానీ ఘనత ఆమె సొంతం
కివీస్​ మహిళా క్రికెటర్ సోఫీ డివైన్

అంతర్జాతీయ టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. పురుష క్రికెటర్లకు సాధ్యం కానీ ఓ ఘనతను న్యూజిలాండ్​ మహిళా క్రికెటర్ సోఫీ డివైన్ సాధించింది. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన నాలుగో టీ20లో అర్ధశతకంతో మెరిసిన సోఫీ, మొత్తంగా వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్​గా నిలిచింది.

ఈ జాబితాలో బ్రెండన్‌ మెకల్లమ్‌, మిథాలీ రాజ్.. నాలుగేసి హాఫ్ సెంచరీలతో ఇప్పటికి వరకు తొలిస్థానంలో ఉన్నారు. ఇప్పుడు వీరిని అధిగమించి, అగ్రస్థానానికి చేరుకుంది సోఫీ. ​

కివీస్​ మహిళా క్రికెటర్ సోఫీ డివైన్

ఈ మ్యాచ్​లో సోఫీ 105 పరుగులు చేయడం వల్ల, కివీస్.. 69 పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్​ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా 54*, 61, 77 పరుగులు నమోదు చేసిందీ మహిళా క్రికెటర్.

Last Updated : Feb 29, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details