తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2019, 2:16 PM IST

ETV Bharat / sports

'నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం'

ఐపీఎల్​ వేలంలో అమ్ముడుపోని యూసఫ్ పఠాన్​పై భావోద్వేగ ట్వీట్ చేశాడు అతడి తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్. తను ఎప్పటికీ మ్యాచ్​ విన్నరే అంటూ రాసుకొచ్చాడు.

'నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం'
యూసఫ్ పఠాన్-ఇర్ఫాన్ పఠాన్

గురువారం జరిగిన ఐపీఎల్‌ వేలంలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌కు నిరాశే ఎదురైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అతడిని వదులుకోగా.. రూ.కోటి కనీస ధరతో అతడు వేలంలో ఉన్నాడు. అయితే ఏ జట్టు యూసఫ్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్‌, యూసఫ్‌ తమ్ముడు ఇర్ఫాన్‌ పఠాన్‌ భావోద్వేగ ట్వీట్ చేశాడు. నువ్వే నిజమైన విన్నర్​వని అన్నాడు.

"తాత్కాలిక ఇబ్బందులేవీ.. నీ కెరీర్‌ను ప్రభావితం చేయలేవు. నీ అత్యుత్తమ ఆటతీరును ఎప్పటికీ మరిచిపోలేం. నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే నిజమైన మ్యాచ్‌ విన్నర్‌వి" -ఇర్ఫాన్​ పఠాన్, భారత క్రికెటర్

ఆల్​రౌండర్‌ యూసఫ్ పఠాన్‌.. ఈ ఏడాది రైజర్స్​ తరఫున 10 మ్యాచ్‌లు ఆడాడు. 13.33 సగటుతో కేవలం 40 పరుగులనే చేశాడు. ఈ సీజన్​ మొత్తంలో కేవలం 6 బంతులే బౌలింగ్ చేశాడు.

యూసఫ్‌ పఠాన్​లానే చాలామంది స్టార్​ క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోలేదు. ఆసీస్‌ పేసర్‌ కమ్మిన్స్​ను అత్యధికంగా రూ.15.5 కోట్లకు కోల్​కతా సొంతం చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్​ రూ.10.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇది చదవండి: ఐపీఎల్‌ 2020: 8 ఫ్రాంఛైజీల కొత్త జాబితా ఇదే

ABOUT THE AUTHOR

...view details